వరుసగా హిట్లు కొట్టింది.. పారితోషికం పెంచేసింది.. ఎంతడుగుతోంది?
- వరుస హిట్లతో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్
- పెద్ద హీరోలతో చేస్తుండటంతో కుర్ర హీరోలతో తగ్గిన అవకాశాలు
- ఇదే సాకుగా పారితోషికం పెంచేసి పెద్దమొత్తం డిమాండ్ చేస్తున్న కాజల్
నందమూరి కళ్యాణ్ రామ్ సరసన హిరోయిన్ గా.. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అతి తక్కువ కాలంలో స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. తేజ దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్... పరిశ్రమలో అడుగుపెట్టి సుమారు పది సంవత్సరాలు దాటుతున్నా... గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా మెయిన్ టైన్ చేస్తుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న కాజల్ అజయ్ దేవగన్ సరసన హిందీ సినిమా సింగంలో కూడా నటించింది.
కొన్ని రోజుల క్రితం కాజల్ కు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సినిమాలు కరువయ్యాయని టాక్ వచ్చింది. అసలు కాజల్ పని అయిపోయిందన్న రేంజ్ లో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, మెగా స్టార్ చిరంజీవి సరసన నటించి తిరిగి సడన్ గా రైజ్ అయింది.
'ఖైదీ నెంబర్ 150', 'నేనే రాజు నేనే మంత్రి', 'మెర్సల్' సినిమాలతో వరుసగా హిట్లు కొట్టడంతో ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతలు కాజల్ కోసం క్యూ కడుతున్నారు. తమ సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు .. హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. దీంతో కాజల్ కు ఆఫర్లు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అందుకే కాజల్ ఇప్పుడు పారితోషికం పెంచుకునేందుకు ఓ కొత్త ప్లాన్ వేసిందట.
సీనియర్ హీరోలతో చేయాలంటే కాజల్ ఎక్కువ పారితోషికం అడుగుతోందట. ఇక సీనియర్ హీరోలతో చేస్తే... యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయి గనుక, ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోందట. ఇక తాజాగా తేజ దర్శకత్వంలో వెంకటేష్ సరసన నటిస్తున్న సినిమాకి కూడా పెద్ద మొత్తమే తీసుకుంటోందని అంటున్నారు. ప్రస్థుతం కాజల్ పారితోషికం రూ.3కోట్ల పైమాటేనట.