జై లవ కుశ రికార్డు.. వారం రోజుల్లో రూ.100కోట్లు
- ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవ కుశ
- రికార్డులు బద్దలు కొడుతున్న జై లవ కుశ
- రూ.100కోట్ల క్లబ్ లో చేరిన జై లవ కుశ
ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డుల వర్షం కురిపిస్తోంది. కేవలం విడుదలైన మూడు రోజుల్లోనూ రూ.75కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. వారం రోజుల్లో రూ.100కోట్ల క్లబ్ లో చేరింది. యూఎస్ లోనూ అత్యధిక వసూళ్లు రాబడుతోంది ఈ చిత్రం.
ఎన్టీఆర్ కెరిర్ లో రూ.100కోట్లు సాధించిన మూడో చిత్రం ఇది. ఇప్పటికే ‘ నాన్నకు ప్రేమతో’, జనా గ్యారేజ్ లతో ఈ క్రెడిట్ ని సాధించగా.. తాజాగా జై లవ కుశ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఈ సినిమాలోని జై పాత్రకు విశేష స్పందన లభిస్తోంది. రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ హర్షం వ్యక్తంచేశారు. అభిమానులందరికీ ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచంలోని తెలుగు చిత్ర అభిమానులు అందరికీ ధన్యవాదాలు’ అని ఆయన ట్వీట్ చేశారు.