ఇండియా-పాకిస్తాన్ మధ్య వార్‌ జరుగుతు్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో భారత సైన్యం కోసం మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా విరాళం ప్రకటించారు. 

ఇండియా - పాకిస్తాన్ మధ్య గొడవ

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా, చైనా, ఐక్యరాజ్యసమితి లాంటివి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. ఈ చర్చల నేపథ్యంలో కాల్పుల విరమణ చేపట్టాయి. ఈ నెల 12న చర్చలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇళయరాజా జాతీయ రక్షణ నిధికి తన జీతాన్ని ఇస్తానని ప్రకటించారు.

నిజమైన హీరోలు

సంగీత దర్శకుడు ఇళయరాజా ఎక్స్ లో ఇలా రాశారు: పహల్గాంలో అమాయక పర్యాటకులను క్రూరంగా చంపిన ఘటనకు ప్రతీకారంగా మన ధైర్యవంతులైన సైనికులు సరిహద్దుల్లో అద్భుతంగా పోరాడుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో నేను నా మొదటి సింఫొనీకి 'వేలియంట్' అని పేరు పెట్టాను.

ఒక నెల జీతం ఇచ్చిన ఇళయరాజా

మన ధైర్యవంతులైన సైనికులు శత్రువులను ఓడిస్తారని నేను నమ్ముతున్నాను. "జయ భేరి కొట్టడా! కొట్టడా!" - భారతీయార్. ఈ సమయంలో ఒక భారతీయుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నా సంగీత కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బుతో పాటు ఒక నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి ఇస్తున్నాను. ఉగ్రవాదాన్ని అంతం చేసి, మన సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు సైనికుల కృషికి నావంతు సహాయంగా ఇస్తున్నాను. జై హింద్.