టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం డిసంబర్ 30న జైపూర్ లో జరగనుంది. ఇప్పటికే రాజమౌళి కుటుంబం మొత్తం జైపూర్ కి చేరుకున్నారు. 

టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం డిసంబర్ 30న జైపూర్ లో జరగనుంది. ఇప్పటికే రాజమౌళి కుటుంబం మొత్తం జైపూర్ కి చేరుకున్నారు. ఈరోజు ఉదయం నుండి అతిథులు అందరూ కూడా ఈ పెళ్లి వేదికకు చేరుకుంటున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఈరోజు సాయంత్రం వెల్కం డిన్నర్ తో మొదలై, రేపు మెహంది.. సంగీత్.. జరిపి డిసంబర్ 30న వివాహం జరపాలని నిర్ణయించుకున్నారు.

ఎంతో గ్రాండ్ గా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు 300కి పైగా అతిథులు హాజరుకానున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ ఫ్యామిలీస్ తో జైపూర్ చేరుకున్నారు. అలానే ముఖ్య అతిథులుగా ప్రభాస్, అనుష్క, సుష్మితా సేన్ లతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, దర్శకనిర్మాతలు ఈ పెళ్లికి హాజరుకానున్నారు. 

రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!