నేను డేటింగ్ చేశా... కానీ రాజ్ తరుణ్ ని వదిలేయండి
- తన డేటింగ్ వ్యవహారంపై పెదవి విప్పిన హెబ్బా పటేల్
- రాజ్ తరుణ్ తో తనకు ఎలాంటి ఎఫైర్ లేదంటున్న మరాఠీ భామ
- అయితే తాను డేటింగ్ చేశానంటున్న హెబ్బా
కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అందం, అభినయంతో యూత్ ఇష్టపడే హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన హెబ్బా పటేల్ కి కాస్త బోల్డ్ గా గా మాట్లాడటం అలవాటే.. ఈ అమ్మడిపై పుకార్లకూ కొదవలేదు. హెబ్బా ప్రేమ వ్యవహారానికి సంబంధించి యంగ్ హీరో రాజ్ తరుణ్తో హెబ్బా బాగా క్లోజ్గా మూవ్ అయ్యేదని, ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని, కొన్ని కారణాల వల్ల ఈ మధ్యే విడిపోయారని వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిపై హెబ్బా చాలాసార్లు వివరణ ఇచ్చినా పుకార్లు ఆగలేదు.
తాజాగా హెబ్బా తన ప్రేమకు సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టింది "తాను ప్రేమలో పడిన మాట వాస్తవమే కానీ.. రాజ్ తరుణ్ తో కాదు" అని, తాను వేరే ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని.. కాకపోతే అతను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని చెప్పింది. అతడి సహకారం తోనే తాను ఈ స్థాయి కి ఎదిగానని.. అతగాడి తో తన బంధం గురించి తన కుటుంబానికి కూడా తెలుసని ఆమె చెప్పింది. కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలువలేక పోయిందని అంటోంది.
విడిపోయాక మళ్లీ ఆ కుర్రాడిని కలవలేదని, ఈ విషయం ఇంట్లోవాళ్లకు కూడా తెలుసని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే ఫస్ట్ లవ్ బ్రేకప్ అయ్యిందో... అప్పటి నుంచీ ప్రేమ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, నిజానికి తన దగ్గర అంత టైమ్ కూడా లేదని అంటోంది. ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం "బాగా సంపాదించడం.. సొంత ఇల్లు కట్టుకోవడం" మాత్రమేనట. ఇవి రెండూ పూర్తయ్యాక అప్పుడు పెళ్లి చేసుకొంటుందట.
తన లవ్ స్టోరీ గురించి తెలిసిపోయింది కాబట్టి.. ఇకనైనా రాజ్ తరుణ్ కు, తనకు ఎఫైర్ అంటగట్టొద్దంటోంది హెబ్బా. ఇక తాను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అమ్మాయిని కావడంతో తనకు ముంబయిలో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలని కోరిక ఉన్నా... ఇప్పుడు హైదరాబాద్ నే తన సొంత ఊరుగా భావిస్తున్నానంటోంది. మొత్తానికి తన డేటింగ్ వ్యవహారం గురించి హెబ్బా బోల్డ్ గానే చెప్పేసిందనుకోవాలి.