డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అపించాలని జనసేనానికి వినతి
- డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అడ్డుకోమని జనసేనానికి ఉద్యోగుల వినతి
- విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ డి.సి.ఐ.
- లాభాల్లో వున్న సంస్థను ప్రవేటీకరించాలనుకోవడంపై ఉద్యోగుల ఆందోళన
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ( డి.సి.ఐ.) ను ప్రైవేటీకరణ చేయనున్నారన్న ప్రకటనలతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కలిసి డి.సి.ఐ.ని ప్రయివేటీకరణ బారి నుంచి రక్షించాలని విన్నవించారు. డి.సి.ఐ. విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైద్రాబాదులోని జనసేన పరిపాలన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను శనివారం కలుసుకుని వినతి పత్రాన్ని సమర్పించారు.లాభాలలో ఉన్న డి.సి.ఐ. సంస్థను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని వారు అన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రసంగం వీడియో...