ట్వీట్లతో మళ్లీ ఆజ్యం పోస్తున్న అల్లు అర్జున్ డీజే దర్శకుడు
- కొనసాగుతున్న డీజే టీజర్ డిస్ లైక్స్ వివాదం
- పవన్ ఫ్యాన్స్ పనేనని అంచనా వేస్తున్న టీమ్
- వివాదం కొనసాగుతుండగానే దర్శకుని సంచలన ట్వీట్
పవన్ ఫ్యాన్స్ పై డీజే దువ్వాడ జగన్నాథం దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రస్తావన తేక పోయినా ఓ వెరైటీ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిజె' దువ్వాడ జగన్నాథం చిత్రానికి సంబంధించిన టీజర్ శివరాత్రి సందర్భంగా విడుదలై యూట్యూబ్ లో ఇప్పటికే 5మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్న డీజేను చాలా మంది ఇష్టపడ్డారు. అయితే అదే స్థాయిలో డిజ్ లైక్స్ కూడా రావటం సంచలనంగా మారింది.
టీజర్కు లక్షకుపైగా లైక్స్, అదే స్థాయిలో డిస్ లైక్స్ వచ్చాయి. సాధారణంగా అయితే ఏ హీరో టీజరైనా, ట్రైలరైనా... నచ్చకుంటే వదిలేస్తారు వ్యూవర్స్. కానీ డీజే టీజర్ కు ఈ స్థాయిలో డిస్ లైక్స్ రావడం టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశం అయింది. అల్లు అర్జున్తో విబేధిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ డిస్ లైక్స్ కొట్టారని ప్రచారం జరుగుతోంది.
Thanks for
— Harish Shankar .S (@harish2you) 27 February 2017
that views
&
this likes
"Yatbhaavam Tadbhavati " pic.twitter.com/twpKAxO6K9
ఇలా డీజే టీజర్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ తాజాగా మరో సంచలనం సృస్టించింది. డిజే టీజర్ 5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సందర్బంగా హరీష్ ఓ ట్వీట్ చేసారు. థాంక్స్ ఫర్ దట్ వ్యూస్, థాంక్స్ ఫర్ దిస్ లైక్స్, యత్ భావమ్ తత్ భవతి..... నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే... అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ అసలు భావం లోతుగా ఆలోచిస్తే తెలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఊహించుకున్న వాడికి ఊహింతుకున్నంత మహాదేవ.