Asianet News TeluguAsianet News Telugu

Dhootha2కి హింట్‌ ఇచ్చిన నాగచైతన్య.. అధికారిక ప్రకటన అప్పుడే..

నాగచైతన్య ప్రస్తుతం `తండేల్‌` మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ఈ మేరకు వీడియోని విడుదల చేయగా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

dhootha2 web series update naga chaitanya revealed that arj
Author
First Published Mar 18, 2024, 10:30 AM IST

నాగచైతన్య నటించిన వెబ్‌ సిరీస్‌ `దూత` ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ పొందింది. ఓటీటీలో ఇది దుమ్మురేపింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె కుమార్‌ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు సెకండ్‌ సీజన్‌ తీసుకురాబోతున్నారు. తాజాగా నాగచైతన్య హింట్‌ ఇచ్చారు. చెప్పకనే చెప్పేశాడు. చైతూ లేటెస్ట్ గా ఓ వీడియోని పంచుకున్నారు. ఇందులో ఆయన ఓ రూమ్‌లో న్యూస్‌ పేపర్‌ చదువుతూ కనిపించారు. 

పేపర్‌ తిప్పేస్తూ `కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా.. మీకు ఇంకా క్లూస్‌ కావాలా? అయితే మార్చి 19 వరకు వెయిట్‌ చేయండి అని తెలిపారు. రేపు మంగళవారం దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని వెల్లడించింది. అదే `దూత2` అనౌన్స్ మెంట్‌ అని తెలుస్తుంది. ఎందుకంటే `దూత` న్యూస్‌ పేపర్‌ చుట్టూ జరిగేకథ. అందుకే చైతూ ఇలా న్యూస్‌ పేపర్‌తో హింట్‌ ఇచ్చేశాడు. చెప్పకనే అసలు విషయం చెప్పేశాడు. 

ఇక `దూత`లో చైతూ ఓ న్యూస్‌ పేపర్‌ హోనర్‌గా కనిపించాడు. ఆయన న్యూస్‌ పేపర్‌ క్లిప్పులు చూస్తాడు. వాటిలో తన జీవితంలో నెక్ట్స్ జరగబోయేది వార్తగా వచ్చి ఉంటుంది. దాన్నుంచి తప్పించుకునేందుకు ఆయన పడే స్ట్రగుల్స్, దాన్ని ఆపే ప్రయత్నం ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే `దూత` సిరీస్‌. ఇది మిస్ట్రరీ హర్రర్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు విక్రమ్‌ రూపొందించారు. ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్‌ కావడంతో సెకండా సీజన్‌ని తీసుకురాబోతున్నారు. 

ఇక ప్రస్తుతం నాగచైతన్య.. `తండేల్‌` సినిమాలో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మత్య్సకారుల జీవితాల నేపథ్యంలో పోర్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో యాక్షన్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకి విడుదల కాబోతుంది. 

Read more: అనుష్క శెట్టి నో అంటే.. త్రిష సై అన్నది.. తండ్రి పాత్రకి జోడీగా స్టార్‌ హీరోయిన్‌

Follow Us:
Download App:
  • android
  • ios