బాహుబలి సినిమాతో ప్రభాస్ కు అమ్మాయిల్లో యమా ఫాలోయింగ్ ప్రభాస్ ను చూసి ఫ్లాటయిపోయిన ధోనీ హీరోయిన్ కియారా అద్వానీ ప్రభాస్ ను కలిసేందుకు ట్రై చేసినా కుదరక ఫోన్ లైన్ లో పెట్టిన భామ
బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని అమాంతం ఎత్తేయటం ఎంత నిజమో.. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ కు కూడా అజేవిధంగా దేశవ్యాప్తంగా అభిమానులుగా మారారు. అందులోనూ అమ్మాయిలకు ప్రభాస్ అంటే యమా క్రేజ్. ఈ క్రేజ్ బాలీవుడ్ హీరోయిన్స్ ను కూడా తాకింది. ఫుల్ క్రేజ్ను సంపాదించుకుని బాహుబలితో నేషనల్ స్టార్గా ఎదిగిన ఈ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.
ఇప్పుడతడికి బాలీవుడ్లో ఓ భామ పడిపోయిందట. ధోని హీరోయిన్ కియారా అద్వానీ ప్రభాస్కు ఓ సీక్రెట్ మెసేజ్ పెట్టిందట. గతంలో ప్రభాస్ను కలవడానికి ప్రయత్నించిన ఈ భామకు నిరాశే ఎదురైందట. అందుకే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ హీరో ద్వారా ప్రభాస్ నంబర్ సంపాదించి అతడికి మెసేజ్ పెట్టేసిందట. ఏమని ఆమె మెసేజ్ పెట్టిందో తెలియకపోయినా.. ఆ మెసేజ్కు మాత్రం ప్రభాస్ రిప్లై ఇచ్చాడట. ప్రభాస్ పక్కన హీరోయిన్గా చాన్స్ కొట్టేయడానికి ఇప్పటి నుంచే అతడిని ఆమె లైన్లో పెట్టేస్తోందని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
