త్వరలో సెట్స్ పైకి వక్కంతం వంశీ, బన్నీ మూవీ
- అల్లు అర్జున్ ను మెప్పించిన వక్కంతం వంశీ
- ఇరువురి కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మూవీ
క్రియేటివ్ కథలకు కేరాఫ్ అనిపించుకున్న కథా రచయిత వక్కంతం వంశీ. జూనియర్ ఎన్టీఆర్ తో అశోక్ చిత్రంతో భారీ సినిమాల కథా రచయితగా మారిన వంశీ ఎన్టీఆర్ తో అనుబంధం అప్పటినుంచి అలానే కొనసాగిస్తున్నాడు.. ఒక రకంగా వంశీని భారీ సినిమాల కథా రచయితగా పరిచయం చేసింది ఎన్టీఆర్ అని చెప్పాలి.
అయితే... జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక... జూనియర్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. మరి వంశీ కథ నచ్చలేదా... లేక మరేదైనా కారణం ఉందో తెలియట్లలేదు కానీ... వంశీ ఇప్పుడు బన్నీతో జట్టు కట్టాడు.
పెద్ద హీరోల కోసం కథలు రాసే వక్కంతం వంశీ ని కొత్తగా పరిచయం చేయనక్కర లేదు. అగ్రకథానాయకుల సినిమాల కోసం ఆయన అందించిన కథలు చాలా విజయాలు అందించాయి. తన కథలను తానే వాడుకోవాలని అనుకున్నాడేమో కానీ ఆయన ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా మారాలని రంగం సిద్ధం చేసుకున్నాడు. కొన్ని కారణాల వలన అది కుదరకపోవడంతో ప్రస్థుతానికి బన్నీతో ఓ సినిమా ఛాన్స్ కొట్టేశాడు.
ఈ మధ్య వక్కంతం వంశీ .. బన్నీ ఇద్దరూ అనుకోకుండా ఒక విమాన ప్రయాణంలో కలుసుకున్నారట. ‘రేసుగుర్రం’ సినిమా సమయంలో కలిసి పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహం వుంది. రేసుగుర్రం సూపర్ హిట్ కావటంతో బన్నీకి వంశీపై మంచి అభిప్రాయం ఏర్పడింది.
దీంతో ఆ విమాన ప్రయాణంలోనే వంశీ .. బన్నీకి ఒక స్టోరీ లైన్ చెప్పాడట. ఆ లైన్ బాగా నచ్చేయడంతో, బన్నీ వెంటనే ఓకే చెప్పేయడం జరిగిపోయింది. అలా ఈ కాంబినేషన్ సెట్ అయింది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న సినిమా పూర్తవగానే, ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు.