భారతీయ మగాళ్లందరు అహాంకారంతో కూడిన పందులట.
భారతీయ మగాళ్లను పందులన్న హీరోహిన్
సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకోవాలని సూచన.
భారతదేశంలో ఉన్న మగాళ్లు ఎక్కువ మంది అహాకారంతో ఉన్న పందులని కామేంట్ చేసింది బాలీవుడ్ నటి భూమీ పడ్నేకర్. అక్షయ్ కూమార్ నటించిన టాయిలేట్ సినిమాలో హీరోయిన్గా భూమీ పడ్నేకర్ భారతదేశంలోని పురుషుల పైన సంచలన కామేంట్లు చేసింది. మగాళ్లకు అస్సలు మానవత్వం లేదని. చాలా మంది మగాళ్లు పోగరుబోతులు అని అన్నారు.
టాయిలేట్ సినిమా ప్రచారంలో భాగంగా విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు ఇండియాలో చాలా మంది మగాళ్లు అహంకారంతో కూడిన పందులాగా ఉంటారని అన్నారు. భూమీ తను అన్న మాటలకు వివరణ ఇస్తు ఇలా అన్నారు నేడు మగాళ్లు స్వంత తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని. కని పెంచిన తల్లిదండ్రుల పైన కనీసం కనికరం లేకపోతే ఎలా అని ప్రశ్నించింది.
అంతేకాదు రోడ్డు మీద అమ్మాయిలను ఆటపట్టించడం మగాళ్లకు ఒక ఫ్యాషన్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఎలా ఉండాలి మహిళల, తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలని ఆమె భారతీయ మగాళ్లకు సూచనలు చేసింది.