బిగ్ సర్ ప్రైజ్ : బాలయ్య 'అఖండ' ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సింహగర్జనకు రెడీ అవుతోంది. డిసెంబర్ 2న అఖండ విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సింహగర్జనకు రెడీ అవుతోంది. డిసెంబర్ 2న అఖండ విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ తో అఖండపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.
విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. తాజాగా Akhanda చిత్ర యూనిట్ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నవంబర్ 27న నిర్వహించనున్నారు. ఇంతకీ సర్ ప్రైజ్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ Allu Arjun చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అటు నందమూరి అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు సంతోషంలో మునిగిపోయే అప్డేట్ ఇది.
తొలిసారి Balakrishna, అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనితో ప్రస్తుతం అందరి దృష్టి అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది. ఇటీవల అల్లు, నందమూరి ఫ్యామిలీల మధ్య బాండింగ్ పెరుగుతోంది. అల్లు అరవింద్ కి చెందిన ఆహా ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ గా 'అన్ స్టాపబుల్ ' అనే షో నిర్వహిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్, బోయపాటి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన సరైనోడు చిత్రం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య, అల్లు అర్జున్ వేదిక పంచుకుంటుంటే అభిమానులు సరికొత్త అనుభూతి పొందడం ఖాయం. నవంబర్ 27న సాయంత్రం 6 గంటల నుంచి శిల్ప కళా వేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది.
Also Read: ఆ స్టార్ హీరోయిన్ ని చైతు పెళ్లి చేసుకోవాలనుకున్నాడా ? సమంత కంటే ముందు ఆమెతో డేటింగ్
అఖండ చిత్రంలో బాలయ్య మూడు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. ముఖ్యంగా అఘోరి గెటప్ అందరిని ఆకర్షిస్తోంది. బాలయ్యకు జోడిగా ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. హీరో శ్రీకాంత్ బాలయ్యకు విలన్ గా కనిపిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.