తియ్యని ముద్దు

కాన్స్‌ చలన చిత్రోత్సవాలకు వెళ్లేటప్పుడు ఐశ్వర్యా రాయ్‌ తన ముద్దుల కూతురు ఆరాధ్యను తీసుకెళ్లింది. ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో 17వ సారి కావడం పాల్గొనడం విశేషం. ఈ సారి తల్లితో పాటు కూతురు కూడా అక్కడి ఉత్సవాలకు సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.తల్లీకూతుళ్లను కెమెరాలో బంధించడానికి అక్కడి ఫొటో జర్నలిస్ట్‌లు చాలా ఉత్సాహం చూపిస్తారు. వాళ్ల కెమెరాకు కావల్సిన ‘క్లిక్‌’ దొరికింది. ఆరాధ్యతో కలిసి రెడ్ కార్పెట్ పై నడవడాన్ని పలువురు ఆసక్తిగా గమనించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఐశ్వర్య రాయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన ముద్దుల కూతురుకు ఐష్‌ తియ్యని ముద్దు ఇస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. 

View post on Instagram
View post on Instagram