Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. సాంప్రదాయాల కోసం, ఉమ్మడి కుటుంబం కోసం తపనపడే ఒక వ్యక్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో జానకి వదిన ఆధ్యని  ఇంట్లోకి తెచ్చి పెట్టడమే దీని అంతటికి మూల కారణం అంటుంది పద్మ. ఎందుకు ప్రతి దానికి ఆధ్య ని నిందిస్తావు. నిజమే నేను ఆధ్య ని తీసుకురావడం తప్పే, కానీ జరిగిన ప్రతి తప్పుకి కారణం తను అంటున్నారు తను ఎవరి జీవితాల్లో జోక్యం చేసుకుందని ఉంటుంది జానకి.

 పెళ్లి కావలసిన వాడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది అది తప్పు కాదా ఉంటుంది పద్మ. ఎవరు తిరిగారు ఈ ఇంట్లో నేను తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంటున్నాను. మీరు ఎన్ని మాటలు అన్నా, నా మీద ఎన్ని నిందలు వేసినా పడి ఉంటున్నాను అంటే అందుకు కారణం పెద్దమ్మ అమ్మకి ఇచ్చిన మాట కోసం అంటుంది ఆధ్య. నోరు ముయ్యి. ఎక్కడి నుంచి వచ్చావో అలాగే ఉండు మా ఇంటి విషయాల్లో కలగజేసుకుని స్థాయి నీకు లేదు అంటుంది పద్మ తల్లి.

ఎందుకు ఆధ్య మాట్లాడకూడదు తను ఏ తప్పు చేయదు అంటుంది రామలక్ష్మి. విన్నావా వదినా రామలక్ష్మీ కూడా మాట్లాడేస్తుంది. ఇప్పుడు మాట్లాడుతుంది రేపటి రోజున పోట్లాడుతుంది కూడా అంటుంది పద్మ. నీ కోడలు చాలా తెలివిగా మాట్లాడుతుంది ఇద్దరు భార్యాభర్తల మధ్యన జీవితం సాఫీగా సాగాలి అంటే కావలసింది బాధ్యత ఐక్యత ప్రేమ ఇప్పుడు మా మధ్యన అలాంటివి ఎక్కడ ఉన్నాయి అంటూ తల్లితో చెప్తాడు రఘురాం.

బాధ్యతగా వెళ్లి చూసి రమ్మంటే తను బంధాన్ని మోసుకొచ్చింది. అది తప్పు కాదు కానీ భిన్న అభిప్రాయాలని కలిపి ఉంచాలి అనుకోకూడదు అది తప్పు. ఒక కొంప కూలిపోవడానికి యుద్ధాలు జరగక్కర్లేదు. నచ్చని వ్యక్తుల మధ్య వచ్చే నాలుగు మాటలు చాలు. ఒకప్పుడు నేను మాట్లాడుతుంటే అందరూ మౌనంగా వినేవారు కానీ ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే నేను మౌనంగా వినే పరిస్థితికి దిగజార్చారు.

అందుకే సీతారాములను తాకే అర్హత కూడా లేదని  కళ్యాణం చేయనని చెప్పాను. ఇన్ని రోజులుగా వస్తున్నాను అయితే వదులుకున్నందుకు నన్ను క్షమించు అంటూ తల్లికి దండం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రఘురాం. నీ బంధం కోసం ఈ ఇంట్లో బంధాలని తెంచేస్తున్నావు అంటూ కోడల్ని తిడుతుంది రఘురాం తల్లి.  నాకు తల్లి లేదు నాకు ఏ కష్టం సుఖం వచ్చినా మీతోనే పంచుకున్నాను.

కన్న బిడ్డని ఏకాకిని చేస్తే తన బాధని ఎవరితో చెప్పుకుంటుంది అంటూ అతని పట్టుకొని కన్నీరు పెట్టుకుంటుంది జానకి. భర్త దగ్గరికి వెళ్లి నా భర్త ముందు ధైర్యంగా మాట్లాడే పరిస్థితి రాదు రాకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడకపోతే తప్పు చేసిన దాన్ని అవుతాను. ఇందాక ప్రేమ బాధ్యత అంటూ చెప్పారు. నేను మీ మీద ఎప్పుడు ప్రేమ చూపించలేదు.

మీ ఇష్టాలనే నా ఇష్టాలుగా భావించాను. ఇంట్లో జరిగే ప్రతి విషయంలోనూ మీ జోక్యం ఉండాలనే నేను తపిస్తాను ఇంతకంటే ప్రేమని ఎలా చూపించాలో నాకు తెలియదు అంటుంది. ఇక బాధ్యత గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ బాధ్యతలన్నీ నా బాధ్యతలుగా అనుకొనే నడుచుకున్నాను. ఎప్పుడైనా ఎవరికైనా లోటు చేశానా.

మీతో ఎవరైనా నేను తప్పు చేశాను అని చెప్పారా అంటూ నిలదీస్తుంది. అమెరికా వెళ్లి నా చెల్లెల్ని చూసి రమ్మంటే దాని కూతుర్ని తీసుకుని వచ్చాను. అదొక్కటే నేను చేసిన తప్పు. మీ మాటని కాదని  రక్తసంబంధాన్ని కష్టాలపాలు కాకుండా చూడటం కోసం చేసిన పని అంతేగాని ఈ ఇంటి బంధాలని తెంపటం కోసం చేసిన పని కాదు అంటుంది. సీతారాముల కళ్యాణం జరిపించనని ఎలా చెప్పి వచ్చారు.

అలా చెప్పడం వల్ల మన మధ్యన ఉన్న చిన్న  దూరం ఊరికి పెద్దదిగా కనిపిస్తుంది. నా భర్తని ఎవరు తక్కువగా చేసి చూసిన నా గుండె తట్టుకోలేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. భర్త చేయి పట్టుకొని నేను సీతని అవునో కాదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం నాకు ఎప్పటికీ శ్రీరామచంద్రుడే అంటుంది.

భర్త కాళ్ళ మీద పడిన నా దుఃఖం నా చావు నా సంతోషం నా బాధ అన్ని మీకు వాళ్ళ దగ్గరే ఉంచండి అంతకుమించి ఇంకేమీ వద్దు అంటుంది. నువ్వు చెప్పినవన్నీ నిజాలే కానీ ఆరోజు సీత లక్ష్మణ గీత దాటి లంక దహనానికి కారణమైంది. ఈరోజు ఈ జానకి భర్త మాటని కాదని అమెరికాకి వెళ్లి ఈ ఇంట్లో కురుక్షేత్రానికి కారణమైంది. దీనికి కారణం మాత్రం ఎప్పటికీ నువ్వే అంటాడు రఘురాం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.