Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది.. మంచి పని చేసింది

  • బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా వెళ్లిన జ్యోతి
  • తొలి వారమే బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన జోతి
  • బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పారితోషికంతో అల్లరి సుభాషిణి కి సాయం
actor jyothi big boss remuneration spent for allari subhashini cancer treatment

బుల్లి తెరపై ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’ మొట్ట మొదటి సారిగా తెలుగు బుల్లి తెరపై వస్తుంది.  ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  మొదట్లో ఈ షో కాస్త బోర్ అనిపించినా..రాను రాను ఎంతో ఇంటస్ట్రింగ్ గా మారుతోంది. ఈ షోలోని పార్టిసిపెంట్స్ లో మొదటి వారమే నటి జ్యోతి ఎలిమినేట్ కావడం.. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు ఫోబియాతో బాధపడుతూ..బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోవడం..ఆ తర్వాత సింగర్ మధు ప్రియ ఎలిమినేట్ కావడం ఇలా రోజుకో ట్విస్ట్ వస్తూ బిగ్ బాస్ పై ఆసక్తి పెంచుతుంది.  

 

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి గ్లామర్ డాల్ దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చింది. స్విమింగ్ పూల్ లో గ్రాండ్ గ్లామరస్ ఎంట్రీ ఇచ్చిన దీక్ష షోకి మరింత గ్లామర్ యాడ్ చేసింది. ఇక బిగ్ బాస్ లో పాల్గొని మొదటి వారం ఎలిమినేట్ అయిన జ్యోతి తన మంచితనాన్న చాటుకుంది.  బిగ్ బాస్ షో లో పాల్గొన్నందుకు వచ్చిన పారితోషికాని తన సహనటి చికిత్స కోసం కొంత ఖర్చు చేసింది.  

 

నటి జ్యోతి ఈ మద్య బిగ్ బాస్ లో పాల్గొని మొదటి వారం ఎలిమినేట్ అయ్యింది. అందుకు ఆమెకు కొంత పారితోషికం ఇచ్చారు. అయితే ఆ అమౌంట్ ఓ మంచి పనికి ఖర్చు చేయాలని భావిస్తున్నానని, ఏదైనా సలహా ఇవ్వాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజాని ఆమె కోరినట్టు తెలుస్తోంది. అల్లరి సుభాషిణి చికిత్సకు ఇచ్చి ఆమెకు సహకరించాలని శివాజీరాజా సలహా ఇవ్వగా, వెంటనే రూ. 50 వేలను ఆమెకు ఇచ్చింది జ్యోతి.  ఇక జ్యోతి చేసిన మంచి పనికి టాలీవుడ్ నుంచేకాక సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios