Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ కు నచ్చ చెప్పచ్చని చిరు ఆ డెసిషన్ తీసుకున్నారా?

ఆ మధ్యన తండ్రీ తనయుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు. అలాగే ఇప్పటికే  ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నటి కాజల్‌ చిరు సరసన నటిస్తోంది. 

Acharya to hit the screens on December 17?
Author
Hyderabad, First Published Oct 7, 2021, 8:55 AM IST


చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్. ఈ సినిమా వేసవిలోనే థియోటర్స్ లోకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్‌ అనంతరం చిత్రీకరణ పునఃప్రారంభించి పూర్తి చేసారు.  రామ్‌చరణ్‌‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ‘సిద్ధ’అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ మధ్యన తండ్రీ తనయుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు. 
అలాగే ఇప్పటికే  ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నటి కాజల్‌ చిరు సరసన నటిస్తోంది. మరొక పాత్రలో పూజాహెగ్డే చరణ్‌కు జోడిగా నటిస్తోంది.  అయితే ‘ఆచార్య’ థియేటర్లో పాఠాలు ఎప్పటినుంచి చెప్పనున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ వార్త బయిటకు వచ్చింది. 

ఆచార్య చిత్రాన్ని డిసెంబర్‌ 24వ తేదీన విడుదల చేయాలని మొదట అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవల అఫీషియల్ గా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్‌ లేకపోవడంతో డిసెంబర్‌ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట. అయితే అదే రోజున ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ కూడా రిలీజ్‌ కానుంది. దీనిపై ఇదివరకే మేకర్స్‌ అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.

Also Read  బాలయ్యతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్‌.. మళ్లీ ఫ్యాక్షన్‌

కానీ అందుతున్న సమాచారం మేరకు పుష్ప షూటింగ్‌ను ఇంకా పూర్తి చేసుకోలేదు. దీంతో ఆ తేదీలోగా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. దాంతో  ‘పుష్ప’ టీమ్ ఇంకాస్త ముందుకు వెళ్లేలా రిలీజ్ డేట్ మార్చే అవకాసం ఉందంటున్నారు. మెగా కుటుంబ చిత్రమే కాబట్టి ఆ డేట్‌ను ‘ఆచార్య’కు కెటాయిస్తారు అని చెప్పుకుంటున్నారు.ఈ విషయమై పూర్తిగా క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. 

 ఆచార్య చిత్రం అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది . దేవాదాయ శాఖ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్‌ చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. మరోవైపు మలయాళీ చిత్రం ‘లూసీఫర్‌’ తెలుగు రీమేక్‌ చేస్తున్నారు చిరంజీవి. ఈ చిత్రాన్ని మోహన్‌ రాజా తెరకెక్కించనున్నారు. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు.

Also Read షాకింగ్ కామెంట్స్ : ‘సమంతని ఆ హీరో ట్రాప్ చేశాడు’, సొంత సంపాదన ఆమె ఖాతాలోకి వెళ్లటం లేదు
  

Follow Us:
Download App:
  • android
  • ios