Asianet News TeluguAsianet News Telugu

తెలుగు,తమిళంలో సంచలన చిత్రం 'సైరత్ ' రీమేక్

  • మరాఠి భాషలో వంద కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించిన సైరత్
  • సైరత్ చిత్రాన్ని రీమేక్ చేయనున్న 'రాక్ లైన్ ' వెంకటేష్ జీ స్టూడియోస్
  • చిన్న సినిమాగా వచ్చి 100 కోట్లు కలెక్ట్ చేసిన సైరత్ చిత్రం

 

100 crore movie syrath remake in telugu and tamil by rockline venkatesh

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా  'సైరత్'. కొత్త తారలతో 4  కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం 100  కోట్ల మైలురాయిని దాటినా తొలి మరాఠీ భాషా చిత్రంగా రికార్డులు సృష్టించింది. పరువు హత్యల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం లో ఆకాష్ తొషర్, రింకు రాజగురు హీరో హీరోయిన్లు గా నటించారు. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు .

 

ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, కరన్ జోహార్ వంటి ఎందరో ప్రముఖ బాలీవుడ్ తారల మనసు దోచుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ రైట్స్ కోసం విపరీతమయిన క్రేజ్ నెలకొంది. చివరికి భారీ మొత్తం చెల్లించి ప్రముఖ నిర్మాణ సంస్థ రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత వెంకటేష్  మరియు జీ స్టూడియోస్ సంస్థ చేజిక్కించుకున్నారు .

 

ఈ సందర్భంగా రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ... "నా మనసుకి నచ్చిన సినిమా ఇది. చూసిన వెంటనే ఈ సినిమా రీమేక్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాo.66వ బెర్లిన్ చిత్రోత్సవం లో ఈ సినిమా చూసిన అందరు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. లాస్ ఏంజెల్స్లోని సోనీ సింఫనీ స్టూడియోలో పాటల రికార్డింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. అందరికి బాగా తెలిసిన కథనే దర్శకుడు నాగరాజ్ మంజులే హృద్యంగా తెర పై ఆవిష్కరించారు.

ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రింకు రాజగురు కి జాతీయ పురస్కారం కూడా దక్కింది. చిన్న సినిమాలలో పెద్ద విప్లవం తీసుకొచ్చిన ఈ చిత్రాన్ని అతి త్వరలో తెలుగు, తమిళం భాషలలో రీమేక్ చేయనున్నాం. తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయ్యింది .ప్రస్తుతం లొకేషన్స్ ఎంపిక జరుగుతోంది .పూర్తి వివరాలు అతి త్వరలో నే తెలియచేస్తాం." అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios