వాంఖడే స్టేడియంలో శుక్రవారం రోహిత్ శర్మ స్టాండ్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్, ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ హాజరయ్యారు.
వాంఖడే స్టేడియంలో 'రోహిత్ శర్మ స్టాండ్' శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో పాటు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్, ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, "ఇలాంటి గౌరవం నాకు దక్కుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. చిన్నప్పుడు ముంబైకి, ఇండియాకి ఆడాలనేది నా కల. ఇలాంటి గౌరవం గురించి ఎవరూ ఆలోచించరు. నా పేరు దిగ్గజ ఆటగాళ్లలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆడుతున్నప్పుడే ఈ గౌరవం దక్కడం మరింత సంతోషంగా ఉంది. రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినా, ఒక ఫార్మాట్లో ఇంకా ఆడుతున్నాను" అని అన్నారు.
"21వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడటం, ముంబై ఇండియన్స్ తరపున ఆడటం, నా పేరు మీద ఉన్న స్టాండ్లో ఆడటం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. టీమ్ ఇండియా తరపున ఆడుతున్నప్పుడు కూడా ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుంది."
నా కుటుంబం, ముఖ్యంగా నా తల్లిదండ్రులు, అన్న, వదిన, భార్య ముందు ఈ గౌరవం దక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్లు నా కోసం చేసిన త్యాగాలకు నేను కృతజ్ఞుడిని. ముంబై ఇండియన్స్ టీమ్కి కూడా ధన్యవాదాలు" అని ఆయన అన్నారు.
ఫడ్నవీస్, పవార్ రోహిత్ను సత్కరించారు.
రోహిత్ కెరీర్ విషయానికొస్తే.. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో రోహిత్ ఒకరు. 499 అంతర్జాతీయ మ్యాచ్లలో 42.18 సగటుతో 19,700 పరుగులు చేశారు. 49 శతకాలు, 108 అర్ధశతకాలు, 264 అత్యధిక స్కోరు సాధించారు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ గా రోహిత్ నిలిచార.
కెప్టెన్గా రెండు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు, టీ20 ప్రపంచకప్లు గెలిచారు. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఇటీవల టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.