Asianet News TeluguAsianet News Telugu

RCB : పేరుమార్చుకున్న కోహ్లీ టీమ్.. స‌రికొత్త లుక్ లో కొత్త జెర్సీతో బెంగ‌ళూరు.. !

CSK vs RCB : ఐపీఎల్ 2024 మార్చి 22న చెన్నైలో ప్రారంభం కానుంది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లు తొలి మ్యాచ్ లో తలపడనుంది.
 

New name, new jersey for Royal Challengers Bangalore.. Virat Kohli's team eyeing the IPL 2024 title RMA
Author
First Published Mar 21, 2024, 2:11 PM IST

Royal Challengers Bengaluru : రాబోయే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాల‌ని చూస్తున్న బెంగ‌ళూరు టీమ్ త‌న పేరులో స్వ‌ల్ప మార్పుతో పాటు స‌రికొత్త లుక్ లో కొత్త జెర్సీని సైతం విడుద‌ల చేసింది. కొత్త పేరు, కొత్త జెర్సీతో ఈ సీజ‌న్ ను ఆరంభం నుంచే అద‌ర‌గొట్టాల‌ని చూస్తోంది.

హై-వోల్టేజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌కి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడబోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వారి కొత్త గ్రీన్ జెర్సీని ఆవిష్కరించింది. దీంతో ఇప్పటికే సందడి చేస్తున్న ఐపీఎల్ టోర్నీకి ఈ ఆవిష్కరణ వేడుక మరింత ఉత్సాహాన్ని నింపింది.  ఇటీవ‌ల బెంగ‌ళూరు టీమ్ మ‌హిళ‌ల జ‌ట్టు డ‌బ్ల్యూపీఎల్ 2024 ట్రోఫీ గెల‌వ‌డంతో అంద‌రి కళ్ళు ఆర్సీబీ టీమ్ పైనే ఉన్నాయి. క్రికెట్ అభిమానులు రాబోయే 17వ ఎడిషన్ కోసం జట్టు తాజా మార్పుల‌తో ఫుల్ జోష్ లో క‌నిపిస్తోంది. త‌మ జ‌ట్టులోని బెంగ‌ళూరు పేరులో స్వ‌ల్ప మార్పును కూడా చేసింది.

2018 నుంచి 2024 వ‌ర‌కు ఐపీఎల్ ఆడుతున్న టాప్-5 ప్లేయర్లు వీరే..

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం త‌మ‌వంతు సాయం చేస్తున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్.. 2011 నుండి పర్యావరణ సుస్థిరత వైపు ఒక గొప్ప అడుగు వేసింది. గ్రీన్ జెర్సీని పరిచయం చేయడం ద్వారా వారి “Go Green” చొరవతో అవగాహనను క‌ల్పిస్తోంది. బెంగళూరుకు చెందిన ఫ్రాంచైజీ ఐపీఎల్ టోర్నమెంట్‌లో కొన్ని ఆటలకు ఆకుపచ్చ జెర్సీని ధరించింది. ఇది పర్యావరణం పట్ల తమ నిబద్ధతను చూపుతుంది. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ తర్వాత, ఫ్రాంచైజీ చెన్నైకి చేరుకుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూప‌ర్ కింగ్స్ తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌కు ముందు, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ త‌మ జ‌ట్టు కొత్త ఆకుపచ్చ జెర్సీని ఆవిష్కరించాడు. విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్ వంటి స్టార్ ఆర్సీబీ క్రికెటర్లు ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు తమ కొత్త గ్రీన్ జెర్సీని ప్రదర్శించారు.

 

నా వంతు ప్రయత్నం చేస్తా.. విరాట్ కోహ్లీ

ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఫ్రాంచైజీకి ఐపీఎల్ 2024  టైటిల్ గెలవడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పాడు. ఆర్సీబీ అంకితభావంతో ఉన్న అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చే ప్రాముఖ్యతను కోహ్లీ నొక్కి చెప్పాడు. అందరికీ తెలిసినట్లుగా తాను ఎల్లప్పుడూ ఇక్క‌డే ఉంటాన‌నీ, ఆర్సీబీ కోస‌మే ఆడ‌తాన‌ని అన్నాడు.  ఈ సారి ఐపీఎల్ టైటిల్ గెలుపు కోసం త‌న‌వంతుగా సంపూర్ణ‌మైన కృషి చేస్తాన‌నీ, అభిమానుల కోసం, ఫ్రాంచైజీ కోసం.. ఐపీఎల్‌ను గెలవడం ఎలా అనిపిస్తుందో తెలుసుకోవడం కోసం.. ఇది ఒక క‌ల అని పేర్కొన్నాడు.

IPL 2024: ధోనిని ఢీ కొట్ట‌నున్న విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ఈసారైనా టైటిల్ గెలిచేనా..?

Follow Us:
Download App:
  • android
  • ios