దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేసింది. దీంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోపీని గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది టీమిండియా.. 

భారత్ ఆదివారం దుమ్మురేపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 76 రన్స్ తో అదరగొట్టాడు. దీంతో మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే టీమిండియా కప్పు కైవసం చేసుకుంది. టీమిండియా ప్లేయర్స్ సమిస్టి కృషితో రాణించారు. కాగా మ్యాచ్ తర్వాత సంబరాలు హైలైట్ గా నిలిచాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ట్రోఫీ కైవసం చేసుకున్న సంతోషంతో ఇద్దరు ప్లేయర్స్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రోహిత్, కోహ్లీ స్టంప్స్ పట్టుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఫైనల్లో భారత్ దుమ్మురేపింది

టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 251/7 స్కోరు చేసింది. కుల్దీప్ యాదవ్ (2/40), వరుణ్ చక్రవర్తి (2/45) బౌలింగ్ తో అదరగొట్టారు. డారిల్ మిచెల్ (63 బంతుల్లో 101), మైఖేల్ బ్రేస్వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్), రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37) బాగా ఆడారు.

భారత్ బ్యాటింగ్ కు దిగి 49 ఓవర్లలో టార్గెట్ ను కొట్టేసింది. రోహిత్ (76), శ్రేయాస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34*) రాణించారు. హార్దిక్ పాండ్యా 18 రన్స్ చేసి గెలుపును ఖాయం చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ హ్యాట్రిక్

ఈ గెలుపుతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా నిలిచింది. గతంలో 2002 (శ్రీలంకతో కలిసి), 2013లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో గెలిచింది. 2023 వన్డే ప్రపంచ కప్ లో రన్నరప్ గా నిలిచిన తర్వాత, ఈ గెలుపు భారత్ కు మరింత బలాన్నిచ్చింది.

స్కోర్లు:

న్యూజిలాండ్: 50 ఓవర్లలో 251/7 (డారిల్ మిచెల్ 63, మైఖేల్ బ్రేస్వెల్ 53 నాటౌట్, రచిన్ రవీంద్ర 37; కుల్దీప్ యాదవ్ 2/40, వరుణ్ చక్రవర్తి 2/45.

భారత్: 49 ఓవర్లలో 254/6 (రోహిత్ శర్మ 76, శ్రేయాస్ అయ్యర్ 48; మిచెల్ సాంట్నర్ 2/46, మైఖేల్ బ్రేస్వెల్ 2/28).