Asianet News TeluguAsianet News Telugu

India vs England : ఉప్పల్ స్టేడియం న్యూ లుక్ అదిరిపోయిందిగా !

India vs England : భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా హైద‌రాబాద్ వేదిక‌గా జ‌న‌వ‌రి 25న‌ తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. దీని కోసం రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌నల్ స్టేడియం సిద్ధ‌మైంది. ఉప్పల్ స్టేడియం న్యూ లుక్ అదిరిపోయింది.. !

India vs England Test series 2024 : Hyderabad Uppal Stadium's new look is awesome RMA
Author
First Published Jan 24, 2024, 12:12 PM IST

India vs England - Uppal stadium : భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా మారింది. ఇరు జట్ల మధ్య జనవరి 25 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లకు వేదికైంది. వరల్డ్ కప్ పోరులో  పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా నెటిజన్లు సీటింగ్ పరిస్థితులను హైలైట్ చేశారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా అధికారికంగా పిలువబడే ఉప్పల్ స్టేడియం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఎ) ఆధీనంలో ఉంది. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియంలో 39,200 సీటింగ్ కెపాసిటీ ఉంది.

వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత ఇంగ్లాండ్ కు ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం విశేషం. 2023 జూన్ లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో సిరీస్ ను 2-2తో సమం చేసింది.  టెస్టు మ్యాచ్ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు వేదికకు చేరుకున్నాయి. భారత్ తో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి స్టేడియం కు చేరుకుంది. వీరిలో బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), డాన్ లారెన్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్ ఉన్నారు.

వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ఆడడు..

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఉండడని  టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. అలాగే, వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి వైదొలగాలని కోరిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులను భారత్ ఆడనుంది. 

ఇంగ్లాండ్ తో జరిగే తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ ( వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వీసీ), అవేశ్ ఖాన్ లు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios