Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ అవార్డ్ ని రెండు ముక్కలు చేసుకున్న యశశ్వి జైశ్వాల్

‘ ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. యశశ్వి ఎప్పుడూ పరుగుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ట్రోఫీల గురించి ఆలోచించడడు. ఆ ట్రోఫీ విరిగిపోయినందుకు కనీసం బాధకూడా పడడు’ అని చెప్పారు. 

India U19 star Yashasvi Jaiswal's Man Of the Tournament trophy breaks into two pieces
Author
Hyderabad, First Published Feb 14, 2020, 7:40 AM IST

మనకు ఏదైనా ఆటలోనే, ఇంకెందులోలైనా చిన్న బహుమతి వచ్చిందనుకోండి... దానిని ఏం చేస్తారు..? చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అవునా.. కానీ ఇండియన్ క్రికెటర్ యశశ్వి జైశ్వాల్ మాత్రం తన ట్రోఫీని రెండు ముక్కలు చేసుకున్నాడు.  ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం యశశ్వికి దక్కింది.

Also Read అమ్మాయిలకు సెక్సీగా కనిపించాలని....: గుట్టు విప్పిన రస్సెల్..

దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చాక చూస్తే... ఆ ట్రోఫీ రెండు ముక్కలయ్యింది. కనీసం అది అలా ఎలా అయ్యిందో కూడా అతనికి తెలియకపోవడం గమనార్హం.  దీని  గురించి యశశ్వి కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడారు.

‘ ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. యశశ్వి ఎప్పుడూ పరుగుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ట్రోఫీల గురించి ఆలోచించడడు. ఆ ట్రోఫీ విరిగిపోయినందుకు కనీసం బాధకూడా పడడు’ అని చెప్పారు. 

మరోవైపు ఫైనల్స్ లో చెత్త షాట్ ఆడి జైశ్వాల్ ఔటయ్యాడు. ఈ విషయంలో చాలా బాధపడ్డాడు అట. ‘ నేను చెత్త షాట్ ఆడాను. ఆ సమయంలో అది అనవసరం. నును ఊహించిన దానికన్నా బంతి చాలా వేగంగా వచ్చింది. అంతకు ముందే నెమ్మదిగా వస్తున్న బంతిని ఎదుర్కొన్నాను. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది. కానీ.. దీనితోనే ప్రపంచం ముగిసిపోదుగా’ అని  యశశ్వి పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios