MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • పాకిస్థాన్ పై వరుణ్ చక్రవర్తి మాస్ ట్రోలింగ్.. !

పాకిస్థాన్ పై వరుణ్ చక్రవర్తి మాస్ ట్రోలింగ్.. !

Varun Chakravarthy : టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత వరుణ్ చక్రవర్తి తన టీ కప్పు ఫోటోతో పాకిస్థాన్‌పై సెటైర్లు వేశారు. భారత్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన వేళ ఈ ఫోటో వైరల్‌గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 09 2026, 10:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆసియా కప్ రివెంజ్ తీర్చుకున్న వరుణ్.. మళ్ళీ అదే టీ కప్పుతో పాక్ మీద సెటైర్లు
Image Credit : Getty

ఆసియా కప్ రివెంజ్ తీర్చుకున్న వరుణ్.. మళ్ళీ అదే టీ కప్పుతో పాక్ మీద సెటైర్లు

అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు తర్వాత టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. గతంలో పాకిస్థాన్‌తో జరిగిన వివాదాస్పద ఆసియా కప్ ఫైనల్ ఘటనను గుర్తు చేస్తూ, వరుణ్ మరోసారి టీ కప్పుతో ఉన్న ఫోటోను షేర్ చేసి దాయాది దేశంపై సెటైర్లు వేశారు.

26
వరుసగా రెండోసారి కప్ గెలిచిన భారత్
Image Credit : Getty

వరుసగా రెండోసారి కప్ గెలిచిన భారత్

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుత అర్ధసెంచరీలతో విరుచుకుపడ్డారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 159 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకోవడమే కాకుండా, ఈ ట్రోఫీని మూడుసార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది.

Related Articles

Related image1
Team India : టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసిన గౌతమ్ గంభీర్
Related image2
Team India : ఫ్లాప్ అవుతున్నా అభిషేక్ శర్మకే ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అసలు నిజం చెప్పిన గంభీర్
36
వరుణ్ చక్రవర్తి వైరల్ పోస్ట్.. అసలు కథ ఇదే
Image Credit : Getty

వరుణ్ చక్రవర్తి వైరల్ పోస్ట్.. అసలు కథ ఇదే

భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత, వరుణ్ చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ఫోటోను పంచుకున్నారు. అందులో ఆయన ఒక చేత్తో ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకుని, మరో చేత్తో టీ కప్పులో టీ తాగుతూ కనిపించారు. ఈ ఫోటో చూసిన క్రికెట్ అభిమానులు వెంటనే దీనిని పాకిస్థాన్‌పై చేసిన వ్యంగ్యాస్త్రంగా భావిస్తున్నారు. ఈ పోస్ట్‌కు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తుండగా, "పాకిస్థాన్‌ను మరోసారి ఆటాడుకున్న వరుణ్ చక్రవర్తి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

No Pakistani harm in this pic of Varun Chakravarthy😂 pic.twitter.com/XuBRUfULnE

— कट्टर INDIA समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) March 9, 2026

46
గత ఏడాది ఆసియా కప్ వివాదం
Image Credit : INSTAGRAM/chakaravarthyvarun

గత ఏడాది ఆసియా కప్ వివాదం

వరుణ్ చక్రవర్తి ఇలా టీ కప్పుతో ఫోటో దిగడం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2025 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, అప్పట్లో పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో భారత్ ట్రోఫీ లేకుండానే స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆ మరుసటి రోజు వరుణ్ చక్రవర్తి తన బెడ్‌పై పడుకుని, ట్రోఫీ ఉండాల్సిన చోట టీ కప్పును ఉంచి ఫోటో దిగారు. అప్పట్లో అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

56
టీ కప్పు వెనుక ఉన్న రహస్యం ఇదే
Image Credit : Gemini

టీ కప్పు వెనుక ఉన్న రహస్యం ఇదే

ఆ ఫోటో గురించి వరుణ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ.. "మేము కచ్చితంగా గెలుస్తామని నాకు తెలుసు. అందుకే కప్పు పక్కన పెట్టుకుని పడుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నాను. కానీ మ్యాచ్ తర్వాత మా దగ్గర ట్రోఫీ లేదు. అక్కడ కేవలం ఒక కాఫీ కప్పు మాత్రమే ఉంది, అందుకే దానితోనే ఫోటో దిగి నా ప్లాన్‌ను పూర్తి చేశాను" అని సరదాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ చేతిలో ఉన్నా, పాత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ టీ కప్పుతో ఫోటో దిగడం విశేషం.

66
వరుణ్ చక్రవర్తి మిస్టరీ ప్రదర్శన
Image Credit : X@BCCI

వరుణ్ చక్రవర్తి మిస్టరీ ప్రదర్శన

ఈ 2026 టీ20 ప్రపంచకప్‌లో వరుణ్ చక్రవర్తి మిశ్రమ ఫలితాలను సాధించారు. మొత్తం టోర్నీలో 14 వికెట్లు పడగొట్టి జాయింట్ హయ్యస్ట్ వికెట్ టేకర్లలో ఒకరిగా నిలిచినప్పటికీ, పరుగులను నియంత్రించడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. తాను బౌలింగ్ చేసిన 31 ఓవర్లలో దాదాపు 287 పరుగులు ఇచ్చారు. అయినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించారు. ఇప్పుడు తన పోస్ట్‌తో మైదానం బయట కూడా వరుణ్ వార్తల్లో నిలుస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐసీసీ వరల్డ్ కప్ టీమ్ లో మనోళ్లదే హవా.. ఆ నలుగురు ప్లేయర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Team India : టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసిన గౌతమ్ గంభీర్
Recommended image3
Team India : ఫ్లాప్ అవుతున్నా అభిషేక్ శర్మకే ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అసలు నిజం చెప్పిన గంభీర్
Related Stories
Recommended image1
Team India : టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసిన గౌతమ్ గంభీర్
Recommended image2
Team India : ఫ్లాప్ అవుతున్నా అభిషేక్ శర్మకే ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అసలు నిజం చెప్పిన గంభీర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved