Asianet News TeluguAsianet News Telugu

T20 WC 2024: భారత్ vs ఇంగ్లండ్..గయానాలో సెమీ ఫైన‌ల్ పోరు.. ఎవరిది పైచేయి?

IND vs ENG Semi-Final T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న‌ది. ట్రోఫీని అందుకోవడానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్న టీమిండియా ఇప్పుడు సెమీ ఫైన‌ల్లో జూన్ 27న గయానాలో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
 

IND vs ENG T20 WC 2024: India vs England.. Semi-finals in Guyana. Who has the upper hand? RMA
Author
First Published Jun 26, 2024, 4:01 PM IST | Last Updated Jun 26, 2024, 4:01 PM IST

IND vs ENG Semi-Final T20 World Cup 2024 : అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో టీ20  ప్రపంచ కప్‌లో భారత జట్టు త‌న జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న‌ది. ఐసీసీ ట్రోఫీకి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. జూన్ 24న ఆస్ట్రేలియాను చిత్తుచేసిన త‌ర్వాత టీమ్ ఇండియాకు సెమీఫైనల్ టిక్కెట్ దక్కింది. ఇప్పుడు ఈ రౌండ్‌లో భారత్ జూన్ 27న గయానాలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. భారత జట్టు ఇప్పటి వరకు ఇక్కడ 3 టీ20 మ్యాచ్‌లు ఆడింది. గ‌త మ్యాచ్ ల‌ను గ‌మ‌నిస్తే ఇక్క‌డ ఇండియాకు అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఓట‌మి లేకుండా ఆరు విజయాలు సాధించింది. గ్రూప్ దశలో భారత జట్టు 3 మ్యాచ్‌లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. దీని తర్వాత, సూప‌ర్-8లో రోహిత్ సేన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు రోహిత్ శర్మ జట్టు సెమీ-ఫైనల్, ఫైనల్స్‌లో కూడా విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తోంది. అంతకు ముందు గయానా వేదికగా జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌కు భారత జట్టు  గ‌త రికార్డులు గ‌మ‌నిస్తే..

గయానాలో టీమిండియా గ‌త రికార్డులు ఎలా ఉన్నాయి? 

గ‌యానాలోని క్రికెట్ స్టేడియంలో ఇండియా మొత్తం 3 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో భారత జట్టు 2 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో మెన్ ఇన్ బ్లూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2019లో ఇదే మైదానంలో భారత జట్టు తొలి టీ20 మ్యాచ్‌ ఆడి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గతేడాది వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించగా, తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. 

ఇంగ్లండ్ ప‌రిస్థితి ఏంటి? 

ఇంగ్లండ్ జట్టుకు ఈ మైదానం మంచి ట్రాక్ రికార్డు అయితే లేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఇంగ్లండ్‌ ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడగా, ఆ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2024లో కూడా ఇంగ్లిష్ జట్టు తడబడి సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీఫైనల్‌లో గత ప్రపంచకప్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు పూర్తి మాస్టర్ ప్లాన్‌తో కూర్చుంటుంది. అయితే వర్షం ఈ మ్యాచ్‌ని చెడగొట్టే అవకాశం ఉందన్న భయం నెలకొంది.

ఫైనల్ వెళ్లేది ఎవ‌రు? 

టీమిండియాకు ఫైనల్ టిక్కెట్ కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే జూన్ 27న గయానాలో దాదాపు 89 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ప్రపంచ కప్‌లో మొదటి సెమీ-ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంచబడింది, కానీ రెండవ మ్యాచ్ కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 27న భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయితే.. టీమ్ ఇండియా నేరుగా ఫైనల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. మ్యాచ్ జ‌రిగినా ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ ఓట‌మి లేకుండా ముందుకు సాగుతోంది కాబ‌ట్టి విజ‌యావ‌కాశాలు భార‌త్ కే ఉన్నాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios