సారాంశం

Eluru : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఏలూరులో ప్రియురాలిపై క‌త్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు ఓ ప్రియుడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. 
 

Boyfriend hacks girlfriend to death: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఓ షాగింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక ప్రియుడు త‌న ప్రియురాలి పై అత్యంత క్రూరంగా క‌త్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న‌లో ప్రియురాలు తీవ్రంగా గాయపడి అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు ఆస్ప‌త్రిలో ప్రాణాల‌తో పోరాడుతున్నాడు. ఈ షాకింగ్ దృశ్యాలు ఘ‌ట‌న ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ఈ షాకింగ్ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఏలూరులో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే..  ప్రియుడు ప్రియురాలిపై క్రూరంగా దాడిచేసి ప్రాణాలు తీసిన త‌ర్వాత‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతురాలు రత్న గ్రేస్, ప్రియుడు యేసురత్నం గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే, ఇటీవలే రత్న గ్రేస్ కు వివాహం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న కుటుంబ స‌భ్యులు మ‌రొక‌రితో పెళ్లిని ఫిక్స్ చేశారు.

T20 World Cup 2024 ను రెండు దేశాల్లో ఎందుకు నిర్వ‌హిస్తున్నారు?

ఈ విష‌యం తెలుసుకున్న ప్రియుడు ఏసుర‌త్నం మనస్తాపానికి గుర‌య్యాడు. త‌న ప్రియురాలు ర‌త్న‌గ్రేస్ పై కోపంతో ర‌గిలిపోయాడు. ఈ క్ర‌మంలోనే  యేసురత్నం తన వెంట తెచ్చుకున్న క‌త్తితో రత్న గ్రేస్‌పై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ త‌ర్వాత ఏసుర‌త్నం ఆత్మహత్యకు యత్నించాడు. ఇదంతా కూడా అక్క‌డున్న సీసీటీవీలో రికార్డు అయింది. రక్తపు మడుగులో ఇద్దరూ కనిపించారు. రత్న అక్కడికక్కడే మృతి చెందగా, యేసురత్నం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

 

 

అతిపెద్ద సవాలు అదే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైర‌ల్