దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం: ముగ్గురు మహిళా క్రికెటర్లకు పాజిటివ్
ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లుగానే క్రీడారంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లకు కూడా కోవిడ్ సోకింది.
ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లుగానే క్రీడారంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లకు కూడా కోవిడ్ సోకింది.
తాజాగా దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ బృందంలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇందులో ఇద్దరు క్రికెటర్లు కాగా, ఒకరు సహాయక సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) శనివారం ప్రకటించింది.
Also Read:కరోనాతో మరో సిరీస్ గోవిందా: టీమిండియా మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటన రద్దు..?
ఇంగ్లాండ్ పర్యటన కోసం సోమవారం నుంచి మహిళల క్రికెట్ శిక్షణా శిబిరం జరగాల్సి ఉండగా.. ప్రాక్టీస్ నుంచి ఈ ముగ్గురిని తప్పించినట్లు సీఎస్ఏ వెల్లడించింది. పాజిటివ్గా తేలిన ముగ్గురిలోనూ అతి స్వల్ప స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని పేర్కొంది.
వీరు రానున్న పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని పేర్కొంది. అనంతరం తమ వైద్య బృందం పరీక్షించాకే వారు ప్రాక్టీస్లో పాల్గొంటారని చెప్పింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ శిబిరానికి హాజరయ్యే క్రికెటర్ల బృందానికి 34 రకాల పరీక్షలు నిర్వహించినట్లు సీఎస్ఏ వెల్లడించింది.