Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: తూర్పు గోదావరిలో ఫాస్టర్ అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చర్చిలో ప్రార్ధనలు నిర్వహించిన ఫాస్టర్ ను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.
 

church foster arrested for violating lock down rules in East godavari district
Author
East Godavari, First Published Apr 5, 2020, 12:06 PM IST


రాజమండ్రి:తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చర్చిలో ప్రార్ధనలు నిర్వహించిన ఫాస్టర్ ను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు  అమల్లో ఉన్నాయి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాయవరంలో చర్చిలో ఓ ఫాస్టర్  ఆదివారం నాడు తెల్లవారుజామున ఉపవాస ప్రార్ధనలు నిర్వహించారు.

తెల్లవారుజామునే చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు చర్చికి వెళ్లారు. అప్పటికే ఆ చర్చిలో  సుమారు 150 మంది సామాజిక దూరం పాటించకుండానే ఆ చర్చిలో ఉన్నారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

నిబంధనలకు విరుద్దంగా ఎలా ప్రార్ధనలు నిర్వహించారని పోలీసులు ఫాస్టర్ ను ప్రశ్నించారు. అయితే ఈ విషయమై సరైన సమాధానం నిర్వాహకుల నుండి రాలేదు. దీంతో పాస్టర్ విజయరత్నంను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also readఏపీపై కరోనా పంజా: 12 గంటల్లో 34 కొత్త కేసులు, 226కి చేరిన మొత్తం కేసులు

కరోనా వైరస్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి నుండే ఎక్కువగా ఈ కేసులు ఎక్కువగా నమోదైనట్టుగా  రికార్డులు చెబుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ  ఫాస్టర్ నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios