జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు సంపాదించాలని విద్యార్థులతో పాటు పేరెంట్స్ ఆశిస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
6వ తరగతికి నోటిఫికేషన్
జవహర్ నవోదయ: 2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. జూన్ 15, 2025 నుండి జూలై 29 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఉన్న 654 నవోదయ విద్యాలయాల్లో సీట్ల భర్తీని చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 నవోదయ పాఠశాలలు ఉన్నాయి.
అర్హతలు, పరీక్ష తేదీలు
ఈ ఏడాది ఐదో తరగతికి వచ్చే విద్యార్థులు అర్హులు. విద్యార్థుల పుట్టిన తేదీ మే 1, 2014 నుండి ఏప్రిల్ 30, 2016 మధ్య ఉండాలి. పరీక్షను రెండు దశల్లో నిర్వహించనున్నారు. 2025 డిసెంబర్ 13 (ఉదయం 11:30 గంటలకు) – తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో, ఇక రెండో దశ విషయానికొస్తే.. 2026 ఏప్రిల్ 11 – జమ్మూ కశ్మీర్, పర్వత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఫలితాలను 2027 జూన్లో విడుదల చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ఇందుకోసం ముందుగా అధికారిక వెబ్సైటు navodaya.gov.inలోకి వెళ్లాలి. అనంతరం హోమ్ పేజీలో కనిపించే "JNVST Class 6 Registration 2026-27" లింక్పై క్లిక్ చేయాలి. కావాల్సిన వివరాలను అన్నింటినీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పరీక్ష విధానం
ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ అబిలిటీ: 40 ప్రశ్నలు, అర్థమెటిక్: 20 ప్రశ్నలు, లాంగ్వేజ్ టెస్ట్: 20 ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.