Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ దెబ్బకు కుప్పకూలిన దేశీయ స్టాక్‌మార్కెట్లు...

తాజా నమోదైన కరోనావైరస్ కేసుల నివేదికలపై సెన్సెక్స్ ట్రేడ్ చివరి గంటలో 1,298 పాయింట్లు పడిపోయి 39,083 నుండి 37,785 కు పడిపోయింది. 

sensex and Nifty extended losses for the seventh straight session on coronavirus fears today
Author
Hyderabad, First Published Mar 4, 2020, 4:34 PM IST

కరోనావైరస్ భయంతో వరుసగా ఏడవ సెషన్‌లో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి పడిపోయాయి. తెలంగాణ, ఢిల్లీలో 2 కరోనావైరస్ కేసులు నమోదైన తరువాత సెన్సెక్స్ ఈ రోజు గరిష్ట స్థాయి నుండి 1,298 పాయింట్లను కోల్పోయింది. 

తాజా నమోదైన కరోనావైరస్ కేసుల నివేదికలపై సెన్సెక్స్ ట్రేడ్ చివరి గంటలో 1,298 పాయింట్లు పడిపోయి 39,083 నుండి 37,785 కు పడిపోయింది. సెన్సెక్స్ 153 పాయింట్లు తగ్గి 38,144 వద్ద ముగియగా, నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 11,132 వద్దకు చేరుకుంది. మొత్తంమీద, సెన్సెక్స్‌లో 30 స్టాక్‌లలో 23, నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 35 స్టాక్స్ ఎరుపు రంగులో ముగిశాయి.

రూపాయి దాని ప్రారంభ లాభాలన్నింటినీ పోగొట్టుకుంది. భారతదేశంలో రెండు కొత్త కరోనావైరస్ కేసులు నమోదైన తరువాత సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 50 పైసలు తగ్గి 72.74 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది.

also read క్రిప్టోక‌రెన్సీల‌పై సుప్రీం కోర్ట్ సంచ‌ల‌న తీర్పు...

అంతకుముందు, దలాల్ స్ట్రీట్ శుక్రవారం చివరిసారిగా 2.85% పైగా పడిపోయింది. సెన్సెక్స్ 785 పాయింట్లు పెరిగి 39,083 స్థాయికి చేరుకుంది, నిఫ్టీ 200 పాయింట్లు పెరిగి 11,433 వద్దకు చేరుకుంది. కరోనా వైరస్ ఎదుర్కోవటానికి బ్యాంక్ ఆఫ్ జపాన్, ఫెడరల్ రిజర్వ్ తమ ఆర్థిక వ్యవస్థల్లో లిక్విడిటీ ఇంజెక్షన్‌ను సూచించిన తరువాత ఈ రికవరీ వచ్చింది.

"కరోనావైరస్ వ్యాప్తి వలన కలిగే ఆర్ధిక నష్టాన్ని పరిమితం చేయడంలో సహాయపడటానికి ప్రపంచ కేంద్ర బ్యాంకులు ప్రధాన కేంద్ర బ్యాంకుల మధ్య సమన్వయ సడలింపు ద్వారా పనిచేస్తాయని, పెట్టుబడిదారులలో పెరుగుతున్న ఆశలపై గ్లోబల్ స్టాక్స్ సోమవారం పుంజుకున్నాయి" అని హెచ్‌డిఎఫ్‌సి రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. 

సెక్టార్ వారీగా, బిఎస్ఇ మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, బేసిక్ మెటీరియల్స్, యుటిలిటీస్, ఎనర్జీ, టెలికాం సూచీలు 2.05 శాతం వరకు పడిపోగా, ఐటి, టెక్ సూచికలు కాస్త లాభదాయకంగా ముగిశాయి. బ్రాడర్ బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.77 శాతానికి పడిపోయాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో అత్యధికంగా నష్టపోయిన వారిలో ఎస్‌బిఐ, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఒఎన్‌జిసి, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.

నేటి సెషన్ పతనంతో, సెన్సెక్స్ మరియు నిఫ్టీ వరుసగా ఏడు రోజులకు పడిపోయాయి. రెండు సూచికలు మొత్తం వారంలో 5% పైగా పడిపోయాయి. సెన్సెక్స్ 7.54%, నిఫ్టీ 8.51% పడిపోయింది.

also read బంగారం ధరలు మళ్ళీ పరుగో.. పరుగు..10 గ్రాముల ధర ఎంతంటే ?


53 దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం, ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారులను కలవరపరిచాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో గ్లోబల్ ఈక్విటీల నుండి 6 ట్రిలియన్ డాలర్ల కోతకు దారితీసింది. సెన్సెక్స్, నిఫ్టీ కూడా శుక్రవారం చివరి ట్రేడింగ్ సెషన్లో పెద్ద అమ్మకాలను నమోదు చేశాయి.

బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ .41,397 తో పోలిస్తే భారతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ తాజా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 783 రూపాయలు పెరిగి ఈ రోజు గరిష్ట స్థాయి 42,180 కి చేరుకుంది.

యస్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, గెయిల్, హీరో మోటోకార్ప్  భారీగా నష్టపోగా, ఐషర్ మోటార్స్, హెచ్‌సిఎల్ టెక్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ ,టెక్‌ మహీంద్ర  లాభపడుతున్నాయి.  ప్రస్తుతం దాదాపు 200 పాయింట్లకు పైగా రికవరీనా సాధించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios