వినియోగదారులకు షాక్.. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు
2 రోజుల తరువాత పెట్రోల్ ధరలు మళ్ళీ పెరగడంతో ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.80. దేశంలోని అన్నీ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు మిన్నంటాయి. పెట్రోల్ ధర లీటరుకు 15-16 పైసలు పెరిగింది దీంతో లీటర్ ధర రూ. 80, డీజిల్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
దేశంలోని అన్నీ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు మిన్నంటాయి. కోల్కతా, ముంబై, చెన్నై నాలుగు మెట్రోల్లో పెట్రోల్ ధర లీటరుకు 15-16 పైసలు పెరిగింది, డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 2 రోజుల తరువాత ధరలు మళ్ళీ పెరగడంతో ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.80.
రెండు రోజుల తరువాత శుక్రవారం మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరుకు రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై నాలుగు మెట్రోల్లో పెట్రోల్ ధర లీటరుకు 15-16 పైసలు పెరిగింది దీంతో లీటర్ ధర రూ. 80, డీజిల్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
also read మార్చిలోగా 1000 చోట్ల క్లౌడ్ కిచెన్లు : స్విగ్గీ
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర రెండు నెలల గరిష్టానికి దగ్గరగా ఉంది. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధర వరుసగా రూ .74.35, రూ .77.04, రూ .80.01, రూ .77.29 కు పెరిగింది.
నాలుగు మెట్రో నగరాల్లో డీజిల్ ధర వరుసగా రూ .65.84, రూ .68.25, రూ .69.06, రూ .69.59 గా నిలకడగా ఉంది. పెట్రోల్ చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం పెట్రోల్ ధరలను చెన్నైలో 15 పైసలు, ఢిల్లీ, కోల్కతా, ముంబైలలో లీటరుకు 16 పైసలకు పెంచాయి. ముంబైలో పెట్రోల్ ధర అక్టోబర్ 3 2019న లీటరుకు రూ .80.11 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో రెండు రోజుల తర్వాత ముడి చమురు ధరలు పెరుగుదల దిశగా ట్రేడవుతోంది, అయినప్పటికీ పెట్రోల్ ధర రెండు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.
also read రతన్ టాటా భుజంపై చెయ్యి వేసి కుర్రాడు...ఇప్పుడు ఏంచేస్తున్నాడో తెలుసా...
క్రూడ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $ 63 పైన ఉంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ (ఐసిఇ) పై బ్రెంట్ క్రూడ్ జనవరి ఒప్పందం ప్రకారం బ్యారెల్కు 63.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు శుక్రవారం జరిగిన సెషన్తో పోలిస్తే ఇది 0.56 శాతం తగ్గింది.
అదే సమయంలో అమెరికన్ లైట్ క్రూడ్ ఆయిల్ వెస్ట్ టెక్సాస్ లో బ్యారెల్కు 58.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు సెషన్తో పోలిస్తే ఇది 0.67 శాతం తగ్గింది.