Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్... తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ పెట్రోల్‌కు..

పెట్రోల్ పై 2.69 రూపాయలు, డీజిల్ పై 2.33 రూపాయల తగ్గింది. ఇప్పుడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌కు రూ .70.29, డీజిల్‌కు రూ .63.01 . ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం మంగళవారం దేశ రాజధానిలో పెట్రోల్ రూ .72.98, డీజిల్ రూ .65.34 వద్ద అమ్ముడవుతోంది.

Petrol, diesel prices cut by over Rs 2 today in hyderabad
Author
Hyderabad, First Published Mar 11, 2020, 12:50 PM IST

న్యూఢిల్లీ : చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రూ .2 కు తగ్గించాయి. పెట్రోల్ పై 2.69 రూపాయలు, డీజిల్ పై 2.33 రూపాయల తగ్గింది. ఇప్పుడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌కు రూ .70.29, డీజిల్‌కు రూ .63.01 . ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం మంగళవారం దేశ రాజధానిలో పెట్రోల్ రూ .72.98, డీజిల్ రూ .65.34 వద్ద అమ్ముడవుతోంది.

also read చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు...సరికొత్త రికార్డు స్థాయికి పసిడి...

సౌదీ అరేబియా, రష్యా దేశాల మధ్య ధరల యుద్ధం కారణంగా ముడి చమురు రేట్లు ఫిబ్రవరి 2016 నుంచి కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇంధన ధరల తగ్గింపునకు కారణమని అధికారులు చెప్పారు. సోమవారం, అంతర్జాతీయ చమురు ధరలు 31 శాతానికి కుప్పకూలిపోయాయి.

ఇది ఒపెక్ + కూటమి విచ్ఛిన్నమైన తరువాత సౌదీ అరేబియా, రష్యా మధ్య  చమురు ధరల యుద్ధానికి దారితీసింది.బ్రెంట్ ఫ్యూచర్స్ ప్రకారం సోమవారం బ్యారెల్ 31 డాలర్లకు పడిపోయింది.

also read ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చేమటలు పట్టిస్తున్న కరోనా వైరస్...కారణం ?

చెన్నైలో ఒక లీటరు పెట్రోల్ ధర లీటరుకు 73.02 రూపాయలు కాగా, డీజిల్ ధర  లీటరుకు 66.48 రూపాయలు.బెంగళూరులో  పెట్రోల్ రూ .72.70, డీజిల్ రూ .65.16 కు అమ్ముడవుతోంది. హైదరాబాద్‌ పెట్రోల్ పంపుల్లో లీటరు పెట్రోల్‌కు రూ .74.72, డీజిల్‌కు రూ .68.60 వసూలు చేస్తున్నారు. చమురు అవసరాలలో 84 శాతానికి పైగా భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios