పని ప్రదేశాన్ని డెకొరేట్ చేసేటప్పుడు రంగులు సమతులంగా ఉండేలా చూసుకోవాలి. లేత, ముదురు రంగులను సమతులం చేసుకోవాలి. అలాగే ప్రతి అలంకరణలోనూ రెండింటినీ సమతులం చేసుకోవడం అవసరం.
కార్యాలయంలో, వ్యాపార సంస్థలలో మీరు కూర్చున్న కుర్చీ వెనుక ఒక పొడవాటి భవనం ఫోటో తగలించుకుంటే మంచిది. ఇది మీకు అండనిస్తుంది. వ్యాపారాన్ని నిర్వహించేవారు ద్వారానికి వీపు పెట్టి కూచోకూడదు. ఎందుకంటే వ్యాపార అవకాశాలు ద్వారం గుండానే వస్తాయి కనుక వాటికి వీపు పెట్టి కూర్చోకూడదు. ఏదైనా బహుళ అంతస్థుల భవనంలో కార్యాలయం ఉన్నప్పుడు కారిడార్కు లేదా మెట్లు లేదా స్టోర్ రూమ్లు, లిఫ్టులు, టాయిలెట్లు వంటివి వాటి ముఖంగా కూర్చోకూడదు. సృజనాత్మక శక్తి బాగా పెంపొందేందుకు కంప్యూటర్ను వాయువ్య దిశలో పెట్టుకోవాలి. ఆదాయం ఎక్కువగా లభించాలనుకునే వారు తమ కంప్యూటర్ను ఆగ్నేయ దిక్కున పెట్టుకోవాలి.
ఆఫీసులో తూర్పు దిక్కున లేదా ఉత్తరాన లేదా ఆగ్నేయ దిక్కున ఆక్వేరియంను లేదా టేబుల్ టాప్ ఫౌంటెన్ను పెట్టుకోవాలి. మీ డెస్క్కు ఉత్తరాన నలుపు లేదా నీలం రంగు చేపలు వేసిన చిన్న కుండీని పెట్టుకోవడం వల్ల లేదా కార్యాలయంలోనైనా సరే పెట్టడం వల్ల మీ వాణిజ్యం, కెరీర్ విజయవంతం అవుతాయి. పశ్చిమాన లేక వాయువ్య దిక్కున లోహంతో తయారు చేసిన సేఫ్ను పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రెండు దిక్కులూ లోహానికి సంకేతాలు. వ్యాపారంలో ఆర్ధిక భద్రతకు, సంపదకు సేఫ్ ఒక సంకేతం.
పని ప్రదేశాన్ని డెకొరేట్ చేసేటప్పుడు రంగులు సమతులంగా ఉండేలా చూసుకోవాలి. లేత, ముదురు రంగులను సమతులం చేసుకోవాలి. అలాగే ప్రతి అలంకరణలోనూ రెండింటినీ సమతులం చేసుకోవడం అవసరం. అది కిటికీలకు సంబంధిం చిందైనా, ఫర్నిచర్కు సంబంధించి అయినా, ఫ్లోరింగ్కు సంబంధించింది అయినా. ఆఫీసులో అద్దాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఇది క్లైంట్ల నుంచి వచ్చే ప్రతికూల శక్తిని ఆ గదిలో ఉన్నవారిపై ప్రతిఫలింప చేస్తుంది. కార్యాలయంలో శక్తిపై ఎప్పుడూ నియంత్రణ అవసరం.
మీ ఆఫీసులో ఫైళ్ళను గౌరవించాలి. ఎందుకంటే అవి వ్యాపార గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కార్యాలయంలో వైర్లు వంటి వాటిని లోపలికి ఉండేలా చూసుకోవాలి. వైరింగ్ అంతా అంతర్గతంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల చెత్త పోయి ప్రాణాధార శక్తి ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రవహిస్తుంది. కార్యాలయంలో లోహంతో చేసిన విండ్ చైమ్లను ఎర్రని రిబ్బన్తో కట్టడం ఎంతో మంచిది. ఇది మీ వ్యాపారంలోకి మరింత డబ్బు వచ్చి చేరేందుకు ఉపకరిస్తుంది. ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా పటాన్ని ఏర్పాటు చేసి రోజు నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, నరదృష్టి నివారణ కల్గుతుంది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు సంపద మూలన గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటంతో పాటు ఒక ప్రపంచ పటాన్ని తగిలించడం ఎంతో మేలు చేస్తుంది. లేదా ఒక గ్లోబ్ను పెట్టవచ్చు. దానితో పాటుగా మీరు విజయవంతంగా చేసిన ప్రాజెక్టు తాలూకు కాపీని లేదా ఒక పర్పుల్ కలర్ ఫోల్డర్పై బంగారు రంగు అక్షరాలతో మీ కంపెనీ పేరు లేదా లోగో ముద్రించి ఉన్నది పెట్టుకోవాలి. ముఖ ద్వారం బయట గుండ్రటి ఆకులు గల మొక్కలను పెట్టుకోవడం క్లైంట్లకు, ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పెంచుతుంది.
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
