Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుతో కొణతాల భేటీ: 17న సైకిలెక్కనున్న మాజీమంత్రి

అయితే మార్చి17న చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖపట్నంలో కొణతాల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సీటును కొణతాల రామకృష్ణ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

konathala ramakrishna likely join tdp in march 17th
Author
Amaravathi, First Published Mar 7, 2019, 12:33 PM IST

అమరావతి: మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సైకిలెక్కేందుకు రంగం సిద్ధం రెడీ అయ్యారు. గత కొద్దిరోజులుగా కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా గురువారం అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయిన కొణతాల సుమారు 40 నిమిషాలపాటు ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. 

అయితే మార్చి17న చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖపట్నంలో కొణతాల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సీటును కొణతాల రామకృష్ణ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కొణతాల పార్టీలోకి వస్తే ఏ సీటు అయినా ఇచ్చేందుకు రెడీ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తరుణంలో ఆయన పార్టీలో చేరే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇకపోతే గత కొద్ది రోజులుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన పునర్విభజన చట్టంలోని ఉత్తరాంధ్రకు రావాల్సిన హామీల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. 

ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ గా ఆయన గత కొంతకాలంగా విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంశాలపై ఉత్తరాంధ్రతోపాటు ఢిల్లీ స్థాయి వరకు పోరాటం చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన సైకిలెక్కాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios