జగన్, మోదీలకు నారా లోకేష్ శుభాకాంక్షలు
అటు సార్వత్రిక ఎన్నికల్లోనూ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్రమోదీకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు నారా లోకేష్. గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోందని తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
అటు సార్వత్రిక ఎన్నికల్లోనూ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్రమోదీకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు నారా లోకేష్. గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోందని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ @narendramodi , శ్రీ @ysjagan లకు శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్
తీర్పును గౌరవిస్తున్నా, జనంలోనే ఉంటా: ఓటమిపై నారా లోకేష్ రియాక్షన్
ఈ వార్తలు కూడా చదవండి
గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ @narendramodi , శ్రీ @ysjagan లకు శుభాకాంక్షలు.
— Lokesh Nara (@naralokesh) May 23, 2019