Asianet News TeluguAsianet News Telugu

వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో రివిజన్ పిటిషన్ వేస్తాం: బాబు

వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  అవసరమైతే సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

chandrababunaidu plans to file revision petition in supreme court over vv pat counting
Author
Tiruvuru, First Published Apr 8, 2019, 5:10 PM IST


తిరువూరు: వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  అవసరమైతే సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

సోమవారం నాడు కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. వీవీప్యాట్ల లెక్కింపు విషయమై తాము చేసిన డిమాండ్‌పై ఈసీ పట్టించుకోలేదన్నారు.

దీంతో 21 పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన చెప్పారు.  ఒక్క ఈవీఎంలకు బదులుగా ఐదు ఈవీఎంలలోని వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఐదు ఈవీఎంలలోని వీవీ ప్యాట్లే కాదు కనీసం 25 శాతం ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.ఈ విషయమై సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కీలక ఆదేశాలు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios