వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐ సంచలన నిర్ణయం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగించారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించింది. ఐపీసీ 302 ప్రకారంగా సీబీఐ కేసును రీ రిజిస్ట్రేషన్ చేసింది.
ఈ కేసు విచారణ కోసం కొత్త సీబీఐ బృందం కడపకు రానుంది.ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
also read:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య: మరో ముగ్గురిని విచారించిన సీబీఐ
తొలుత వివేకా హత్య కేసును సీఆర్పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మార్పులు చేసింది. కరోనా ప్రభావంతో కొద్ది రోజులుగా కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. త్వరలోనే స్పెషల్ టీమ్ దర్యాప్తును ప్రారంభించనుంది.