Asianet News TeluguAsianet News Telugu

దుర్గగుడి రథం: నాలుగో సింహాం విగ్రహం అందుకే వదిలేశారా?

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథంపై ఉన్న మూడు సింహాల ప్రతిమల చోరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Vijayawada police searching for accused in lion statues theft case
Author
Vijayawada, First Published Sep 20, 2020, 1:07 PM IST


విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథంపై ఉన్న మూడు సింహాల ప్రతిమల చోరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రథంపై ఉన్న సింహాల ప్రతిమలను దొంగలు స్క్రూలు విప్పి తీసుకెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగో రథం స్క్రూల్ రాకపోకవడంతో ఆ విగ్రహాన్ని పెకిలించే ప్రయత్నం చేసినట్టుగా దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగో విగ్రహాన్ని రథం నుండి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతోనే నిందితులు విగ్రహాన్ని వదిలి  వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

also read:దుర్గగుడి రథంపై వెండి సింహాల ప్రతిమల మాయం: కీలక విషయాలు గుర్తింపు

2002లో ఈ రథాన్ని తయారు చేశారు. ఉగాది సమయంలో రథాన్ని బయటకు తీస్తారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది రథాన్ని బయటకు తీయలేదు.ఈ రథంపై ఉన్న సింహాల ప్రతిమలు చోరీకి గురైనట్టుగా ఆలయ అధికారులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాత నేరస్తులు ఈ  విగ్రహాల ప్రతిమలను చోరీ చేశారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీ ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ రచ్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1996లో కనకదుర్గ ఆలయంలో చోరీకి గురైంది. ఆ సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ విషయమై  అప్పట్లో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios