Asianet News TeluguAsianet News Telugu

హిందూపురంలో వైద్య విద్యార్థిని మృతి కేసులో ట్విస్ట్.. బస్సులో పరిచయం.. ప్రేమిస్తున్నానని వెంటపడి, వేధించి..

ఏపీలోని హిందూపురంలో తెలంగాణకు చెందిన వైద్యవిద్యార్థి అనుమానాస్పద మృతి కేసులో ఆమెతో ఉన్న వ్యక్తే హంతకుడని తేలింది. అతను ప్రియుడు కాదని, వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తని తేలింది. 

Twist in the case of the death of a medical student in Hindupuram
Author
First Published Aug 26, 2022, 6:52 AM IST

జయశంకర్ భూపాల్ పల్లి  : హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  చదువులో ఆమె ముందుండేది. ఎంబిబిఎస్ పూర్తి చేసింది. తాను కూడా వైద్యసేవలు అందించాలని అనుకుంది. ఆలోచనతోనే పిజి చేస్తోంది. ఇంతలో ఆమె కలలు కల్లలయ్యాయి. ప్రయాణంలో పరిచయమైన వ్యక్తి చేతిలో అనంత లోకాలకు పయనం అయింది. ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత (27)కు నాలుగేళ్ల కిందట రేగొండ మండలం నిజాంపల్లికు చెందిన వైద్యుడుతో పెళ్లి జరిగింది. ప్రస్తుతం అతను భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.

వీరికి మూడేళ్ల వయసు  పాప కూడా ఉంది.  అక్షిత కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లోని మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెడుతూఉంటుంది. ఐదు నెలల కిందట అలా ప్రయాణిస్తున్న క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన మహేష్ వర్మతో పరిచయం ఏర్పడింది. ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు  తీసుకుని ఆమెతో చాటింగ్ చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అయితే ఆమె తనకు పెళ్లి అయిందని, బిడ్డ ఉందని తిరస్కరించింది. 

హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. వీడిన మిస్టరీ, ప్రియుడే హంతకుడు..

ఈ క్రమంలో అతను అను సోషల్ మీడియా అకౌంట్ లో ఉన్న ఆమె ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని..  వాటిని మార్ఫింగ్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వాలని,  తన వద్దకు రావాలని బెదిరించాడు.  వరంగల్ నుంచి చిక్ బళ్లాపురం వెళ్లడానికి అక్షిత ఈ నెల 23వ తేదీ సాయంత్రం జైపూర్ ఎక్ష్ప్రెస్స్ లో బయలుదేరింది. చిక్ బళ్లాపురానికి వెళ్లడానికి 24వ తేదీ ఉదయం హిందూపురంలో దిగింది. ఆమె వెంట మహేష్ వర్మ సైతం అదే రైలులో వచ్చాడు. 

మాట్లాడుకుని, సెటిల్ చేసుకుందామని అతను ఆమెను హిందూపురంలోని లాడ్జీకి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో అక్షిత గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి పారిపోవాలని ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు పట్టుకున్నారు. మృతురాలి సోదరుడు శశాంక్ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హిందూపురం పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

అక్షిత మృతితో తిమ్మంపేటలో విషాదం నెలకొంది. అక్షిత తండ్రి ఐదేళ్ల కిందటే మృతి చెందగా.. గ్రామంలో తల్లితోపాటు తమ్ముడు ఉంటున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు  కంటతడి పెట్టుకున్నారు. అక్షిత మూడేళ్ళ పాప ఊహ తెలియకుండానే తల్లిని కోల్పోయింది. అక్షిత మృతదేహానికి హిందూపురంలో పోస్టుమార్టం నిర్వహించి, భర్త స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకు వెళ్తున్నారు.  శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios