Asianet News TeluguAsianet News Telugu

హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. వీడిన మిస్టరీ, ప్రియుడే హంతకుడు..

హిందూపురంలో కలకలం రేపిన వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. ఆమెతో వచ్చిన వ్యక్తి.. స్నేహితుడు కాదని ప్రియుడని.. అతనే ఆమెను హత్య చేశాడని తేలింది. 

mystery revealed in medical student Suspicious death in Hindupur lodge, andhra pradesh
Author
First Published Aug 25, 2022, 12:51 PM IST

హిందూపురం : ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత మృతి కేసులో చిక్కుముడి వీడింది. ఆమెది అనుమానాస్పద మృతిగా  విచారణ ప్రారంభించిన పోలీసులు చివరికి అది హత్యగా తేల్చారు. ఆమెతోపాటు ఉన్న స్నేహితుడు మహేశ్ వర్మ ఆమె ప్రియుడిగా తేలింది. అతనే చంపినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. వరంగల్  ములుగు జిల్లా మంగపేటకు చెందిన ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ మెడికల్ కాలేజీలో డిఎస్బీ చేస్తోంది. అయితే,  అక్షిత సంగారెడ్డి పటాన్చెర కు చెందిన మహేష్ వర్మ అనే వ్యక్తితో కలిసి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా.. హిందూపురంలోని ఓ లాడ్జిలో బస చేసింది. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయినట్లు మహేష్ పోలీసులకు సమాచారం అందించాడు.

అయితే, తామిద్దరం స్నేహితులమని.. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నామని… లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని మహేష్ పోలీసులకు తెలిపాడు. దీంతో,  హిందూపురంలో స్థానికంగా అనుమానాస్పద మృతి అంటూ కలకలం రేగింది. వెంటనే పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం అందించారు. మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు.  పోలీసుల విచారణలో మహేష్ స్నేహితుడు కాదని.. ప్రియుడు అని తేలింది. ఇంటీరియర్ డిజైనర్గా హైదరాబాదులో పని చేస్తున్న మహేష్ మొదట తామిద్దరం స్నేహితులం మాత్రమే అని బుకాయించినా... చివరికి  నిజం ఒప్పుకున్నాడు.

అక్షితతో తనకు సంబంధం ఉందని  ఒప్పుకున్నాడు. లాడ్జిలో ఆమెను గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అయితే,  ఆమెను ఎందుకు చంపాడు అనే విషయంపై ఇంకా వివరాలు తెలియలేదు. అక్షితకు వివాహం అయ్యింది. ఆమె భర్త వరంగల్లో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆమెకు ఏడాది వయసున్న పాప కూడా ఉంది.

హిందూపురం లాడ్జిలో.. తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి...రూంలో మరొక వ్యక్తి...

కాగా, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఓ లాడ్జిలో తెలంగాణాకు చెందిన వైద్య విద్యార్థిని ఒకరు బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టూటౌన్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. ములుగు జిల్లా మంగపేటకు చెందిన అక్షిత (26) ఎంబీబీఎస్ పూర్తిచేసి కర్ణాటకలోని చిక్కబల్లపుర మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. భర్త వరంగల్లో ఆర్థోపెడిక్ వైద్యుడు. ఆమె తన స్నేహితులైన సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన మహేష్ వర్మ (25)తో కలిసి బుధవారం ఉదయం హిందూపురం వచ్చి ఓ లాడ్జిలో దిగారు.

సాయంత్రానికి అక్షిత చనిపోయినట్లు ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేసి తెలిపాడు. మధ్యాహ్నం భోజనం చేసి తామిద్దరం నిద్ర పోయామని,  లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని తెలిపాడు. పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహేశ్ వర్మ హైదరాబాదులో ఇంటీరియర్ డిజైనర్గా పని చేస్తున్నట్లు తెలిసింది. అక్షితకు ఏడాది వయసున్న కుమార్తె ఉంది. స్నేహితుడితో కలిసి ఒంటరిగా ఇక్కడికి వచ్చిందని సిఐ తెలిపారు. అక్షిత మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని  అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios