Asianet News TeluguAsianet News Telugu

భార్యపై అనుమానం.. ఏడాదిన్నర కుమార్తెని బావిలో పడేసిన తండ్రి.. చివరికి...

భార్య మీద అనుమానం అతడి విచక్షణను చంపేసింది. సొంత కూతురన్న మమకారాన్ని మరిచిపోయేలా చేసింది. ఏడాదిన్నర చిన్నారిని బావిలో పడేసేలా ఉసి గొలిపింది. 

Suspicious on wife, father throws daughter into the well in chittoor
Author
First Published Oct 19, 2022, 7:36 AM IST

చిత్తూరు : భార్యపై అనుమానంతో కన్నకూతురినే బావిలో పడేసి హతమార్చడానికి ప్రయత్నించిన ఓ కసాయి తండ్రి ఉదంతం మంగళవారం పుంగనూరు పట్టణంలోని  కోనేటిపాళ్యంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మోహన్రావు తెలిపిన వివరాల మేరకు.. ఏడేళ్ల కిందట కోనేటిపాళ్యంలోని రెడ్డమ్మను పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన అయ్యప్ప వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల హర్ష, ఏడాదిన్నర కుమార్తె హర్షిని ఉన్నారు. రెండేళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తరచు గొడవ పడడం కొట్టడం చేస్తుండేవాడు.  

దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక  రెడ్డమ్మ పిల్లలతో సహా ఆరు నెలల కిందట కోనేటిపాళ్యంలోని పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి భర్త కూడా తరచూ రావడం, గొడవ పడడం మామూలుగా మారిపోయింది. దీంతో రెడ్డెమ్మ తల్లి ఆదిలక్ష్మి రెండురోజుల కిందట తన కుమార్తెకు ఓ ఇల్లు కిరాయికి చూసి వేరుగా కాపురం పెట్టించింది. భర్త కూడా సోమవారం తన స్వగ్రామానికి వెళ్లి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకున్నాడు. ఉదయం భార్యాభర్తల మధ్య వాగ్వాదం పెరగడంతో ఏడాదిన్నర కుమార్తె హర్షినిని తండ్రి తీసుకువెళ్లి ఇంటి ఎదురుగా ఉన్న బావిలో పడేశాడు.  

చంద్రబాబుకు ధన్యవాదాలు ... ఎన్నికలకు ఎలా వెళ్లాలనేది ఒక్కరోజులో తేలదు: పవన్ వ్యాఖ్యలు

స్థానికులు చంద్రమోహన్, జ్యోతి మరికొందరు అది గుర్తించి చిన్నారని బావిలో నుంచి తీసుకొచ్చి అమ్మమ్మ ఆదిలక్ష్మికి అప్పజెప్పారు. పోలీసులు, ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి చిన్నారి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా భార్య రెడ్డమ్మ ఫిర్యాదుతో భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. 

ఇలాంటి ఘటనే తమిళనాడులో ఈనెల ఏడున వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురుని హత్య చేసి.. బకెట్ లో కుక్కి, గడ్డివాములో దాచిపెట్టాడు. అతడిని 45 రోజుల తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. తమిళనాడులోని మధురై నగరంలోని జైహింద్‌పురంలో ఈ ఘటన జరిగింది. హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని 45 రోజుల తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కాళీముత్తు, అతని భార్య ప్రియదర్శిని సోలై అలగుపురంలో నివసిస్తున్నారు. కాళీముత్తు స్థానిక టైలరింగ్ షాపులో, ప్రియదర్శిని తూర్పు గేటు వద్ద ఉన్న పాత్రల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరి కుమార్తె ఎనిమిదేళ్ల తన్షిక.

సెప్టెంబర్ 3న తన్షికను కాళీముత్తు ఇంటి నుంచి బైటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో పాప గురించి భర్తను తల్లి అడగగా.. చిన్నారిని తన చెల్లి ఇంట్లో ఉంచి వచ్చానని చెప్పాడు. సెప్టెంబర్ 23న కాళీముత్తు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు జైహింద్‌పురం పోలీసులకు సమాచారం అందించారు. బాలికను హత్య చేసి, పెద్ద బకెట్‌లో మృతదేహాన్ని కుక్కి.. గడ్డివాములో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే, చంపిన రోజునుంచి కాళీముత్తు పరారీలో ఉన్నాడు. అతనికి భార్యమీద అనుమానం ఉండేది. దీంతో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని విచారణలో తేలింది. నిందితుడిని అక్టోబర్ 5న పలంగనాథం దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితుడు భార్యతో తరచూ గొడవలు జరిగే విషయాన్ని చిన్నారికి చెప్పేవాడని పోలీసులకు తెలిపాడు. అయితే, తామిద్దరం చనిపోదామని బాలిక అతనికి చెప్పింది. దీంతో బాలికను గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని బకెట్‌లో పెట్టాడు. ఆ తరువాత అతను కూడా చనిపోదామని రైల్వే ట్రాక్‌ దగ్గరికి వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లాక మనసు మార్చుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios