హైదరాబాద్ బయలుదేరిన హరికృష్ణ కుమార్తె సుహాసిని
రోడ్డు ప్రమాదంలో తన తండ్రి హరికృష్ణ మృతిచెందడంతో కుమార్తె సుహాసిని కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి-అద్దంకి హైవేపై ఈరోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న కుమార్తె సుహాసిని హుటాహుటిన కాకినాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు.
కాకినాడ: రోడ్డు ప్రమాదంలో తన తండ్రి హరికృష్ణ మృతిచెందడంతో కుమార్తె సుహాసిని కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి-అద్దంకి హైవేపై ఈరోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న కుమార్తె సుహాసిని హుటాహుటిన కాకినాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు.
మరోవైపు మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చంద్రబాబునాయుడు భార్య, హరికృష్ణ సోదరి అయిన భువనేశ్వరి, బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తమ అభిమాన నటుడు, రాజకీయ నేత హరికృష్ణను చివరిసారిగా చూసేందుకు ఆయన నివాసాని అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత
తెలుగు భాషంటే ప్రాణమిచ్చే హరికృష్ణ...మాతృ భాషా దినోత్సవం రోజే ఇలా....
హైదరాబాద్ కు హరికృష్ణ మృతదేహం....వెంట తారక్, కళ్యాణ్ రామ్,చంద్రబాబు, బాలయ్య
రవి అడగటం..హరికృష్ణ కాదనడం లేదు: పరిటాల సునీత
హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం