Asianet News TeluguAsianet News Telugu

కోడ్ ఉల్లంఘన కేసులో కోడెలకు ఊరట

కోడ్ ఉల్లంఘన కేసులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కోర్టులో ఊరట లభించింది. 2014 ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని.. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోడెల స్వయంగా వ్యాఖ్యానించారు. 

Relief for AP Assembly Speaker Kodela exemption from personal appearance
Author
Hyderabad, First Published Oct 10, 2018, 12:12 PM IST

కోడ్ ఉల్లంఘన కేసులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కోర్టులో ఊరట లభించింది. 2014 ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని.. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోడెల స్వయంగా వ్యాఖ్యానించారు.

దీనిపై సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆ ఇంటర్వ్యూలో కోడెల చెప్పిన అంశాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించాడు. దీనిపై నాంపల్లిలోని ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు వివిధ సెక్షన్ల కింద విచారణ చేసింది.

అయితే ఈ కేసులో విచారణ నిలుపుదల చేయాలంటూ కోడెల హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ స్టే గత నెల 27తో ముగియగా.. అక్టోబర్ 10న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయమూర్తి కోడెలను ఆదేశించారు. దీనిపై ఇవాళ నాంపల్లి కోర్టు మరోసారి విచారణ జరపింది.. హైకోర్టు విధించిన స్టే ను ఈ నెల 23కు పోడిగించడంతో పాటు.. తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది. 

కోడ్ ఉల్లంఘన కేసులో కోడెలకు చుక్కెదురు

Follow Us:
Download App:
  • android
  • ios