కోడ్ ఉల్లంఘన కేసులో కోడెలకు చుక్కెదురు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కోర్టులో చుక్కెదురైంది.
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కోర్టులో చుక్కెదురైంది. కోడ్ ఉల్లంఘన కేసులో అక్టోబర్ 10వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 2014 ఎన్నికల సమయంలో రూ.11.50 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారని పిటిషనర్ కోర్టుకు వివరించారు.ఆ ఇంటర్వ్యూలో కోడెల శివప్రసాదరావు చెప్పిన అంశాలను పిటిషనర్ కోర్టుకు ఆధారాలతో సహా వివరించారు
ఈ కేసు విషయమై కోర్టుకు హాజరుకావాలని స్పీకర్ కోడెలను కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టుకు హాజరుకావాల్సిందేనని కోడెలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయమై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.