Narendra Modi : ఈ నెల 27న తిరుమలకు ప్రధాని మోడీ.. శ్రీవారికి ప్రత్యేక పూజలు
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 27న ఉదయం 8 గంటలకు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం 8.55 గంటలకు తిరిగి అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు ప్రధాని తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరుతారు.
![PM Narendra Modi to offer prayers at Tirumala Tirupati Devasthanam on Nov 27, TTD RMA PM Narendra Modi to offer prayers at Tirumala Tirupati Devasthanam on Nov 27, TTD RMA](https://static-ai.asianetnews.com/images/01hfxqw3fyjk42cf6ydnqyx62e/modi-jpg_363x203xt.jpg)
Tirumala Tirupati Devasthanam: కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకోనున్నారు. తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజా ప్రార్థనలు చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలలో పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 6.50 గంటలకు ప్రధాని హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని తిరుమలకు వెళ్తారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. రాత్రి 7.50 గంటలకు రచన అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 27న ఉదయం 8 గంటలకు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం 8.55 గంటలకు తిరిగి అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు ప్రధాని తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరుతారు.
తిరుమలలో భక్తులు రద్దీ, నవంబర్ 24న కైశిక ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి..
తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో నవంబరు 24న కైశిక ద్వాదశి , చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాలు జరగనున్నాయి. కైశిక ద్వాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 4.45 నుంచి 5.45 గంటల మధ్య ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉత్సవమూర్తులు భార్యాభర్తలతో కలసి నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు.
మరోవైపు, చక్రతీర్థం వద్ద ఉన్న ముఖ్యమైన పవిత్ర ధారలలో ఒకటైన చక్రతీర్థ ముక్కోటిని టీటీడీ ఆలయ సిబ్బంది, మత పెద్దలు ఆచరిస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహస్వామి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.