Asianet News TeluguAsianet News Telugu

దోపిడీకి వైఎస్ కుటుంబమే బ్రాండ్ అంబాసిడర్

  • వైఎస్ కుటుంబంపై నక్కా ఆనంద్ బాబు ద్వజం
  • దోపిడీదారులంటూ తీవ్ర విమర్శలు
nakka anand babu fires on ys family

 
ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అడ్డగోలగా దోచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడని ఎంపి మంత్రి నక్కా ఆనంద్ బాబు వర్ణించాడు.  ఇలాంటి వారసత్వం ఉన్న జగన్ కు నిజాయితీతో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదని మంత్రి మండిపడ్డారు.రాష్ట్రంలో  వైసీపీ పార్టీ  కులాలను, వర్గాలను రెచ్చగొట్టడమే తమ పనిగా మార్చుకుందన్నారు. చంద్రబాబును దళిత వ్యతిరేకిగా పేర్కొన్న వైవీ సుబ్బారెడ్డిపైన కూడా విరుచుకుపడ్డారు మంత్రి.  
 ఆయన మీడియాతో మాట్లాడుతూ... దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ ఉంది వైఎస్ కుటుంబమేనన్నారు.  జగన్ తాత రాజారెడ్డి జమానాలోనే ఈ కుటుంబం   భూములను దోచుకుండం మొదలుపెట్టిందని ద్వజమెత్తారు.
 ఇడుపులపాయలోని ఎస్టేట్ కోసం  వేల ఎకరాలు దళితుల భూములను ఆక్రమించారన్నారు. ఎస్పీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇడుపులపాయ అభివృద్ధికే వాడుకున్నారని ఆరోపించారు.
తమ ప్రభుత్వాన్ని నిందించేముందు, వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. లేదంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.                                                                         
 

Follow Us:
Download App:
  • android
  • ios