ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో సుమారు 2వేల మంది దివ్యాంగులైన బాలలతో పాటు, అనాథ చిన్నారుల కోసం నిర్వహించనున్న ‘ఆనంద దీపావళి’కి హాజరు అవుతున్నారు. ఈనెల 17న సాయంత్రం 6.30 నుంచి 7గంటల మధ్య ఆర్కే బీచ్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
