Asianet News TeluguAsianet News Telugu

56యేళ్ల వయసులో.. భార్య, పిల్లలు ఉండగా, మరో మహిళతో లవ్ ఎఫేర్.. ప్రియురాలు పెళ్లి చేసుకోమనడంతో.. ట్విస్ట్...

విశాఖపట్నంలో ఓ 56యేళ్ల వ్యక్తి కనిపించకుండా పోయాడు. అయితే అతను మరో మహిళతో ప్రేమలో పడి.. ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే అదృశ్యమయ్యాడని భార్య ఫిర్యాదు చేసింది. 

man missing over love affair in 56 years of age in visakhapatnam
Author
First Published Aug 26, 2022, 9:42 AM IST

విశాఖపట్నం : భార్య ఉండగానే మరో మహిళతో ప్రేమలో పడిన ఒక ప్రబుద్ధుడు పెళ్లి ఒత్తిడితో ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన రెండు ఇండుగుబిల్లి సన్యాసిరావు (56) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడికి  భార్య, పిల్లలు ఉన్నారు. భార్య ఉండగానే మరో మహిళ మోహంలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయసాగింది. 56 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటే కుటుంబం పరువు పోతుందని భావించిన సన్యాసిరావు ఈ నెల 21న ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు అతడి భార్య పద్మ గాజువాక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గాజువాక ఎస్ఐ కే సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఇలాంటి ఘటనే గురువారం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి దారుణానికి దిగింది ఓ భార్య. కిరాతకంగా భర్తను హత్య చేయడమే కాకుండా, మృతదేహం దొరకకుండా చేపల చెరువు లో పడేశారు. ఈ ఘటన పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఖమ్మం గ్రామీణ మండలం ఆరెంపులకు చెందిన సాయి చరణ్(28), కొనిజర్ల మండలానికి చెందిన ఓ యువతి (25) నాలుగేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. సాయి చరణ్ ఖమ్మంలో చికెన్ వ్యర్థాలు తరలించే వెహికల్ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. అదే  వాహనంలో మరో యువకుడు కరుణాకర్ (30) సాయితో కలిసి పని చేసేవాడు.ఇద్దరి మధ్య స్నేహంతో తరచూ కరుణాకర్ సాయి ఇంటికి వచ్చేవాడు.ఈ నేపథ్యంలోనే సాయి భార్యతో కరుణాకర్ కి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

మద్యంమత్తులో.. గర్భిణీ భార్యను నరికి, తానూ నరుక్కుని.. ఓ భర్త ఘాతుకం..

ఈ విషయం సాయికి తెలిసి భార్యతో అనేక సార్లు గొడవ పడ్డారు. భర్తకు విషయం తెలిసిందని ఇంకా ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని భావించింది భార్య. ప్రియుడితో కలిసి సాయిని అంతమొందించాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య చోటు చేసుకుంది. ఆగస్టు 1న రాత్రి చికెన్ వ్యర్థాలు తీసుకువెళ్లేందుకు వీరిద్దరు మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి మద్యం తాగారు. ఈ సమయంలోనే ఎందుకు తన భార్యతో చనువుగా ఉంటున్నామని కరుణాకర్ ని సాయి నిలదీశాడు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరగడంతో మద్యం మత్తులో ఉన్న కరుణాకర్  బలంగా తోసేయడంతో సాయి ట్రాలీ ఆటోకు కొట్టుకున్నాడు. ఆ తర్వాత పారతో సాయిని బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. హత్య మీద ఎవరికీ అనుమానం రావద్దని చికెన్ వ్యర్థాలు తరలించే వాహనంలో మృతదేహాన్ని పడేశాడు. మృతదేహాన్ని మూటగట్టి వ్యర్థాలతో పాటు వాహనంలో వేసుకున్నాడు.

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడి ప్రైవేటు చేపల చెరువు లో మృతదేహాన్ని పడేశాడు. మృతదేహం పైకి తేలకుండా బలమైన రాయి కట్టాడు. అయినా కూడా మూడు రోజుల తర్వాత మృతదేహం పైకి తేలింది.  మృతదేహంపైకి తేలడం గమనించిన చేపల చెరువు యజమాని కరుణాకర్ కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్ళిన కరుణాకర్ మృతదేహాన్ని పక్కనే ఉన్న ఊరి చెరువులో పడేసి వచ్చేశాడు. ఆగస్ట్ 1న సాయి హత్య జరిగినా..  సుమారు 10 రోజులు ఎక్కడా బయటకు రాలేదు. సాయి ఎక్కడికి వెళ్ళాడు అని అతని బంధువులు, యజమాని  భార్యను అడిగారు. ఎక్కడికి వెళ్ళాడో తనకు కూడా చెప్పలేదని  చెబుతూ వచ్చింది. భర్త హత్యకు గురైనట్లు ఖమ్మం రెండో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయి ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా కరుణాకర్, సాయి భార్యతోపాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios