Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ మ్యాచులపై భారీగా బెట్టింగ్స్... విజయనగరంలో హైటెక్ ముఠా అరెస్ట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా జోరు పెంచారు.

ipl 2020... cricket betting gang arrested in vijayanagaram
Author
Vijayanagaram, First Published Sep 24, 2020, 10:38 AM IST

విజయనగరం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా జోరు పెంచారు. ప్రతి మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ లు నిర్వహిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారు. ఇలా ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. 

పట్టణంలోని ఎలుగుబంటి వారి వీధిలోని ఓ ఇంటిని బెట్టింగ్ కు కేంద్రంగా మార్చుకున్నట్లు విజయనగరం పోలీసులకు సమాచారం అందింది. ఐపిఎల్ సందర్భంగా ఆ ఇంట్లో కంప్యూటర్లతో పాటు ఇతర సాంకేతిక పరికరాలను సమర్చుకుని ఆన్లైన్ చేపడుతోంది ఈ ముఠా.  దీంతో ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆన్లైన్ లో బెట్టింగ్ కు పాల్పడుతుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. బెట్టింగ్ కు సంబంధించిన లావాదేవీలను వీరు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సాగిస్తున్నట్టు  పోలీసులు గుర్తించారు. 

ముంబై వర్సెస్ కోల్‌కత: వరుస ఓటముల చెత్త రికార్డును చెరిపేసిన ముంబై ఇండియన్స్

మంగళవారం రాత్రి రాజస్ధాన్ రాయల్స్  వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ను టీవిల్లో  తిలకిస్తూ లాప్ టాప్, సెల్ ఫోన్లు ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బెట్టింగ్ ముఠా నుంచి 13 సెల్ ఫోన్స్, అయిదువేలు నగదు, టివి, లాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నట్లు...  తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు విజయనగరం పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios