విజయవాడ లో ఫూలే జయంతి వేడుకల్లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్టు (వీడియో)
తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్ద పూలే విగ్రహానికి నివాళులర్పించేందుకు కాంగ్రెస్ నేతలు రఘువీరా, కేవీపీ, పల్లం రాజు, కనుమూరి బాపిరాజు తదితరులు వెళ్లారు. అయితే,
మరికాసేపట్లో సీఎం వస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పూలే విగ్రహం వద్దకెళ్లేందుకు రఘువీరా, కేవీపీ, పల్లం రాజు ప్రయత్నించారు. పోలీసులకు.. కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం.. తోపులాట జరిగింది.
పోలీసులు రఘువీరా, కేవీపీలను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు పోలీసు వాహానాన్ని అడ్డుకునే ప్రయత్నం యచేశారు. అరెస్టయిన వారిని వన్ టౌన్ పోలీసు స్టేషనుకు తరలించయారు.