
ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి బంపరాఫర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనాభా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి, మానవ వనరుల పెంపు కోసం జనాభా సమతుల్యత అవసరమని ఆయన పేర్కొన్నారు.